కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు
మల్లాపూర్లో లబ్ధిదారుడి యూనిట్ ప్రారంభం
మల్లాపూర్, జూలై 4: నిరుపేద దళితులకు ఆర్థిక దన్నునిచ్చేందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. ఈ స్కీంను వినియోగించుకొని ఆర్థికాభివృద్ధి చెందాలని లబ్ధిదారులకు సూచించారు. వాల్గొండ గ్రామానికి చెందిన సిద్ధ శేఖర్ అనే లబ్ధిదారుడికి చెందిన దళితబంధు యూనిట్ కింద మండల కేంద్రంలో ఏర్పా టు చేసిన సూపర్మార్కెట్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్తోనే గ్రామీణుల అభివృద్ధి సాధ్యమని చెప్పా రు. ఇక్కడ ఎంపీపీ కాటిపల్లి సరోజన, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కదుర్క నర్సయ్య, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో రాజశ్రీనివాస్, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు కొమ్ముల జీవన్రెడ్డి, సర్పంచ్ దండిక గంగు, ఎంపీటీసీలు క్యాతం సుజాత, ఆకుతోట రాజేష్, మార్కెట్కమిటీ వైస్చైర్మన్ ముద్దం శరత్గౌడ్ ఉన్నారు.