మారుతీనగర్, డిసెంబర్, 17: ఐక్యతతోనే సంఘాలు అభివృద్ధి చెందుతాయని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. ఆదివారం మెట్పల్లి పట్టణంలోని హనుమాన్ నగర్లో ఆత్మకూర్-మెట్పల్లి పద్మశాలీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన సంఘ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సంఘ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు పద్మశాలీ సంఘ సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.
అలాగే సంఘ భవన ప్రారంభోత్సవానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆత్మకూర్ పద్మశాలీ సంఘ సభ్యుడు బాస ధనుంజయ్ తన తండ్రి బాస పెద్ద భూమయ్య స్మారకార్థం ముద్రించిన శివపంచాక్షరి స్తోత్ర ప్రతిని ఎంపీ ఆవిష్కరించి సంఘ సభ్యులకు అందజేశారు.
కార్యక్రమంలో ఆత్మకూర్-మెట్పల్లి పద్మశాలీ సంఘ గౌరవాధ్యక్షుడు బండి గంగాధర్, అధ్యక్షుడు నడికట్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మ్యాన లింబాద్రి, కోశాధికారి మ్యాన ప్రసాద్, మెట్పల్లి పద్మశాలీ సంఘ అధ్యక్షుడు ద్యావపెల్లి రాజారాం, వేదపండితులు మునుగోటి రవికుమార్ శర్మ, మోహన్ శర్మ, పద్మశాలీ వాడకట్టు సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ఆయా వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.