మెట్పల్లి, జనవరి 4:అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం మెట్పల్లి పట్టణం 21వ వార్డులోని గోల్ హన్మాన్ ఆలయ ఆవరణలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వంద రోజుల్లో ఆ హామీలను అమలు చేయాలన్నారు.
రాజకీయాలకతీతంగా కలిసికట్టుగా మెట్పల్లి పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రజాపాలన దరఖాస్తు పత్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఇబ్బందులు లేకుండా దరఖాస్తులను స్వీకరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ రాణవేని సుజాత, కమిషనర్ జగదీశ్వర్గౌడ్, కౌన్సిలర్ భీమనాతి భవానీ, డీఈఈ రాజ్కుమార్, ఎన్పీడీసీఎల్ ఏడీఈ మనోహర్, ఏఈ అరుణ్కుమార్ పాల్గొన్నారు.