Peddapally | పెద్దపల్లి, జూన్15 : పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా కొప్పుల వెంకట్ రెడ్డి కలెక్టరేట్లో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆర్డీఓగా విధులు నిర్వహించిన వెంకట్ రెడ్డికి ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం జారీ చేసిన బదిలీ, ఉద్యోగోన్నతిలో భాగంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ఉద్యోగోన్నతి లభించడంతో పెద్దపల్లి జిల్లాకు బదిలీ చేశారు.
బాధ్యతలు స్వీకరించిన వెంకట్రెడ్డికి కలెక్టరేట్ సిబ్బంది పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని అదనపు కలెక్టర్ తెలిపారు. ఇక్కడ డీఆర్వో రాజేశ్వరి, కలెక్టరేట్ ఏవో బండి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.