NandiMedaram | ధర్మారం, మార్చి 7: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ సమీపాన నూతనంగా నిర్మించిన గంగపుత్రుల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి ఆలయంలో గంగాదేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలకు హాజరుకావాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఆ గ్రామ గంగపుత్ర సంఘం నాయకులు, గంగాదేవి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కోరారు.
ఆలయంలో 12 నుంచి 14 వరకు విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఇట్టి ఉత్సవాలకు ముఖ్య అతిథుల ఆహ్వానం కోసం ప్రత్యేకంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను ముద్రించారు. ఈ నేపథ్యంలో ఇట్టి ఉత్సవాలకు హాజరుకావాలని శనివారం రాష్ట్ర మాజీ మంత్రి ఈశ్వరులను కరీంనగర్ లోని ఆయన స్వగృహంలో కలిసి వారు ఆహ్వాన పత్రికను అందజేసి గంగపుత్ర సంఘం నాయకులు ధర్మాజీ నరేష్, మంచర్ల లచ్చయ్య తదితరులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.