మల్యాల, జూలై 19: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో 15 రకాల దుకాణాల నిర్వహణకు ఆలయ పాలకమండలి చైర్మన్ తిరుక్కోవెళూర్ మారుతీస్వామి, ఈవో టంకశాల వెంకటేశ్ నేతృత్వంలో స్వల్పకాలిక(8 నెలలకు) టెండర్లను నిర్వహించారు. 4 దుకాణాల టెండర్ ప్రక్రియ ము గియగా వాటి ద్వారా రూ.40.85 లక్షల ఆదాయం సమకూరింది. టెండర్ల పర్యవేక్షణ అధికారి ఆర్ రవికిషన్ తెలిపిన వివరాల ప్రకారం, కొండగట్టు ఆలయ పరిధిలో పూలు, పండ్లు అమ్ముకునేందుకు ఇద్దరు పాల్గొనగా ఆకుల నరేశ్ రూ.16.80 లక్షలకు హక్కులను దక్కించుకున్నారన్నారు. ఆలయ ప్రాంగణంలో గాజులు, ప్లాస్టిక్ వస్తువులు అమ్ముకునేందుకు ముగ్గురు పాల్గొనగా ముత్యంపేటకు చెందిన కోల రాజు రూ.16 లక్షలకు దక్కించుకున్నారన్నారు. అదే విధంగా భక్తుల పాదరక్షలు భద్రపరిచేందుకు వేలం పాటలో ముగ్గురు పాల్గొనగా తిమ్మయ్యపల్లికి చెందిన కొలగాని లక్ష్మీరాజం రూ.4.55 లక్షలకు దక్కించుకున్నారని వివరించారు. అదే విధంగా కొండపైన హోటల్ నిర్వహణకు ఇద్దరు వేలంలో పాల్గొనగా జలంధర్ రూ. 3.50లక్షలకు దక్కించుకున్నారు. కాగా 4 దుకాణాల నిర్వహణకు మాత్రమే సరైన పాట రావడంతో వారికి హక్కులను కల్పించగా ఆలయానికి రూ.40.85 లక్షల ఆదాయం సమకూరనుందని వెల్లడించారు.
అదే విధంగా కొబ్బరి కాయల విక్ర య హక్కు, కిరాణ షాపు నిర్వహణ హక్కు, పుట్నా లు, ప్యాలాలు విక్రయాల హక్కు, శీతల పానీయాలు, ఐస్క్రీం విక్రయ హక్కు, స్నానా లు, మరుగుదొడ్లు నిర్వహించే సులభ్ కాంప్లెక్స్, భక్తులు ఆలయంలో కొట్టిన కొబ్బరి ముక్కల సేకరణకు వేలం పాట, టెండర్ ప్రక్రియలను నిర్వహించినప్పటికీ సరైన ధర రాలేదనే కారణంతో వాటిని రద్దు చేశామన్నారు. అదే విధంగా కొండపైన లాకర్ గది నిర్వహణ, టెంట్హౌస్, వంట చెరుకు అమ్ముకునే హక్కు, ఫొటో స్టూడియో నిర్వహణ హక్కులను పొందేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే వాయిదా పడిన వాటిని ఉన్నతాధికారులకు నివేదించి త్వరలోనే వాటికి టెండర్లను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, ఆలయ పాలకమండలి సభ్యులు పుప్పాల గంగాధర్, పోచమ్మల ప్రవీణ్, జున్న సురేందర్, వొల్లాల లింగంగౌడ్, కొంక సర్సయ్య, ఆలయ ఏఈవో బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు సునీల్, శ్రీనివాసశర్మ, టెండర్ సెక్షన్ ఇన్చార్జి శ్రీనివాసచారి, ఆలయ సిబ్బంది శ్రీనివాస్, సుధాకర్రెడ్డి, ధర్మేందర్, జెమిని శ్రీనివాస్ తదితరులున్నారు.