వీర్నపల్లి, జూలై 19: భారీ వర్షాలతో పశు సంపదను కోల్పోయిన గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. మద్దిమల్లతండాలో 24మంది రైతులకు చెందిన 80ఆవులు ఇటీవల మృతి చెందగా, ఒక్కో బాధితుడికి 5 వేల చొప్పున మంజూరైన చెక్కులను సర్పంచ్ మాలోత్ జవహర్తో కలిసి మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆగయ్య మాట్లాడుతూ, ఆవులను కోల్పోయిన రైతులు అధైర్యపడవద్దని సూచించారు. ప్రభుత్వం అంచనాల ప్రకారం బాధితులందరికీ నష్ట పరిహారం అం దిస్తామని తెలిపారు. పూర్తి స్థాయి నివేదికను సంబంధిత అధికారులు ప్రభుత్వానికి పంపించారని పేర్కొన్నారు. ప్రస్తుతం తక్షణ సాయం అందించామన్నారు. వానకాలం ముగిసేవరకు పశువులను ఇంటి వద్దే కట్టేసుకోవాలని రైతులకు సూచించారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
మద్దిమల్లలో తిమ్మాపూర్ పీఏసీఎస్ డైరెక్టర్ కొట్టాల ప్రతాప్రెడ్డి ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబ సభ్యులను ఆగయ్య పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా బంజేరులో టీఆర్ఎస్ కార్యకర్త బట్టు అనంద్, బావుసింగ్నాయక్తండాలో సర్పంచ్ భూక్యా సుజాత, బాబాయిచెరువుతండాలో సర్పంచ్ భూక్యా లక్ష్మి కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ మాలోత్ భూల, ఎల్లారెడ్డిపే టట సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు చాంద్పాషా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ సురేశ్నాయక్, పార్టీ ఎస్సీ విభాగం మండలాధ్యక్షుడు మల్యాల అశోక్, తహసీల్దార్ తఫాజుల్ హుస్సేన్, డిప్యూటీ తహసీల్దార్ ఎల్సాని ప్రవీణ్కుమార్, ఎంపీవో నరేశ్, మండల పశు వైద్యాధికారి రేణుక, నాయకులు సంతోష్, రపీ, లింబాద్రి, కార్యదర్శి రాములు ఉన్నారు.
బీమాతో కార్యకర్తలకు ధీమా
ఎల్లారెడ్డిపేట, జూలై 19: ప్రమాద బీమా టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు ధీమాగా మారిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. గొల్లపల్లి గ్రామాని కి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ఆలకుంట పరశురాములు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెం దగా, పార్టీ నుంచి మంజూరైన 2లక్షల విలువైన బీమా చెక్కును గ్రామాధ్య క్షుడు అందె సురేశ్తో కలిసి మంగళ వారం ఆగయ్య అంద జేశారు. అలాగే గొల్లపల్లికి చెందిన రంగు సత్యలాల్గౌడ్కు 23,500 విలువైన సీఎంఆర్ఎ ఫ్ చెక్కును అందజేశారు. ఇక్కడ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, ఎం పీపీ పిల్లి రేణుక, ఏఎంసీ చైర్మన్ కొండ రమేశ్గౌడ్, మాజీ చైర్మన్లు అందె సుభాష్, గుళ్లపల్లి నర్సింహారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణా రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి, నాయకులు పాశం దేవారెడ్డి, పెంజర్ల దేవయ్య, పాటి దేవయ్య, తీగల ప్రకాశ్గౌడ్, కొండ ఆంజనేయులు, మురళీమోహన్, అఫ్స రున్నీసా, సీతానాయక్ తదితరులు ఉన్నారు.