గంభీరావుపేట, సెప్టెంబర్ 21: నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్తు కల్పించడమే లక్ష్యంగా ఉచిత శిక్షణకు మంత్రి కేటీఆర్ సహకారంతో బీసీ స్టడీ సెంటర్ను ఏర్పాటు చేసుకున్నామని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో ఏర్పాటు చేసిన బీసీ స్టడీ సెంటర్ను రాష్ట్ర పవర్ లూం, టెక్స్టైల్స్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, అదనపు కలెక్టర్ సత్య ప్రసాద్తో కలిసి బుధవారం రవీందర్రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీళ్లు, నిధులు, నియామకాలు అనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేస్తున్నారని, ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడగానే ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు మంత్రి కేటీఆర్ సహకారంతో జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్ను మంజూరు చేసుకున్నామని కొండూరి తెలిపారు. గంభీరావుపేటలో స్టడీ సెంటర్ను ప్రారంభించుకోవడం ప్రాంత నిరుద్యోగ యువతకు సదవకాశమని పేర్కొన్నారు. బీసీ స్టడీ సెంటర్ ద్వారా 90 రోజుల పాటు గ్రూపు-3, గ్రూపు-4 ఉద్యోగాలకు గాను ఉద్యోగార్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ అందిస్తున్నదని, అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సర్కిల్ అధికారి మోహన్రెడ్డి, డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, సర్పంచ్ కటకం శ్రీధర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాండ్లు, కళాశాల ప్రిన్సిపాల్ దాసు, ఏఎంసీ చైర్పర్సన్ సుతారి బాలవ్వ, వైస్ ఎంపీపీ దోసల లత, జడ్పీ కోఆప్షన్ అహ్మద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, నిరుద్యోగ యువతీయువకులు, విద్యార్థులు, నేతలు ఉన్నారు.