చొప్పదండి, సెప్టెంబర్ 21: పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డి అధ్యక్షతన బుధవారం పాలకవర్గ సమావేశం నిర్వహించారు. జూన్-ఆగస్టు 31 వరకు సంఘంలో జరిగిన జమ, ఖర్చులను ఆమోదించారు. సంఘంలో కొత్తగా సభ్యత్వం తీసుకున్న రైతులకు రుణాలు ఇవ్వాలని, ఇచ్చిన రుణాలు సక్రమంగా వసూలు చేయాలని తీర్మానం చేశారు. అలాగే, పట్టణానికి చెందిన శ్రీగాధ గట్టయ్య ఇటీవల మృతిచెందగా ఇద్దరు కూతుళ్లు అనాథలుగా మారారు.
వారికి సంఘం తరఫున రూ.5 వేల నగదు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డి మాట్లాడుతూ, చిన్నారులకు ఆర్థిక సాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో సంఘం ఉపాధ్యక్షుడు ముద్దం మహేశ్, పాలకవర్గ సభ్యులు నాంపల్లి మల్లయ్య, గుర్రం ఆనందరెడ్డి, మంగళారపు మల్లారెడ్డి, గుర్రం సునంద, కోస్న తిరుపతిరెడ్డి, సత్తు నర్సయ్య, దుర్గం పద్మ, కల్లెం లక్ష్మారెడ్డి, లంబు రాజిరెడ్డి, రేవెల్లి బాలయ్య, కొమురయ్య, కార్యదర్శి కల్లెం తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.