తెలంగాణచౌక్, సెప్టెంబర్ 21: స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బైపాస్ కూడలిలో జిల్లా పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన స్థానికంగా ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం, ప్రధాన కార్యదర్శి భద్రయ్య, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్కుమార్ గౌడ్, కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, శ్రీరాములు, ప్రకాశ్, శ్రీకాంత్, పద్మశాలీ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.
బాపూజీ స్ఫూర్తితో ముందుకు సాగాలి
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి పటేల్ పిలుపు నిచ్చారు. నగరంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఆయన పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు అజయ్ పటేల్, నారాయణ గౌడ్, మధు, కుమార్ పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న బార్ అసోసియేషన్ సభ్యులు
జిల్లా కోర్టు ఆవరణలో..
కోర్టుచౌరస్తా, సెప్టెంబర్ 21: జిల్లా కోర్టు ఆవరణలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం రాజారెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు సిరికొండ శ్రీధర్ రావు, బెజ్జంకి శ్రీకాంత్, న్యాయవాదులు ఎం అనిల్కుమార్, కొరివి వేణుగోపాల్, ఆర్ దేవేందర్ రెడ్డి, అర్జిత్ సింగ్, కృష్ణార్జునా చారి, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, సెప్టెంబర్ 21: మండలంలోని గోపాల్రావుపేట పద్మశాలీ సంఘ భవనంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి సంఘం అధ్యక్షుడు కొలిపాక మల్లయ్య, జాతీయ యువజన అవార్డీ అలువాల విష్ణు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ మూడు తరాల ఉద్యమ దార్శనికుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు అలువాల శంకర్, ఏఎంసీ డైరెక్టర్ కొలిపాక మల్లేశం, సంఘం సభ్యులు సిరిపురం సత్యనారాయణ, మామిడాల పరశురాములు, కొలిపాక నాగరాజు, రుద్ర నాగరాజు, అలువాల గంగాధర్, బూర్ల రాంచంద్రం, కొలిపాక శ్రీనివాస్, పంతగాని శ్రీధర్, కొలిపాక సత్తయ్య, రఘు, తదితరులు పాల్గొన్నారు.