గోదావరిఖని/జగిత్యాల రూరల్ మే 25: టీఆర్ఎస్ తరుఫున బుధవారం రాజ్యసభ స్థానానికి నామినేషన్ వేసిన ‘నమస్తేతెలంగాణ’ సీఎండీ దీవకొండ దామోదర్వును జగిత్యాల, రామగుండం ఎమ్మెల్యేలు సంజయ్కుమార్, కోరుకంటి చందర్ బుధవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. దీవకొండ నామినేషన్ పత్రాలపై కోరుకంటి చందర్ సంతకం చేసి ప్రతిపాదించారు. అలాగే టీఆర్ఎస్ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రకు కోరుకంటి, ఎమ్మెల్యే సంజయ్కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.