Mayor Sunil Rao | కార్పొరేషన్, జనవరి 25: కరీంనగర్కు స్మార్ట్సిటీ రావడంలో బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాత్ర ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడారు. స్మార్ట్సిటీ మంజూరైన సమయానికి బండి సంజయ్ ఎంపీ కాలేదన్నారు.
2017లో స్మార్ట్ సిటీ కోసం అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడిని కలిసేందుకు కార్పొరేటర్లందరం వెళ్లామని, అదే టైంలో మంజూరైందని, కానీ, అప్పుడు కార్పొరేటర్గా ఉన్న బండి సంజయ్ మాత్రం తమతో రాలేదని గుర్తు చేశారు. ఇప్పటివరకు స్మార్ట్సిటీ కింద నగరానికి 539 కోట్ల నిధులు వచ్చాయని, వీటిల్లో రాష్ట్రం, కేంద్రం సమానంగా 269.50 కోట్ల నిధులు ఇచ్చాయని పేర్కొన్నారు. వీటికి మించి ప్రత్యేకంగా ఎంపీగా బండి సంజయ్ ఏమైనా నిధులు తెచ్చారా..? చెప్పాలని ప్రశ్నించారు. స్మార్ట్సిటీ పనుల ప్రారంభోత్సవానికి మేయర్ హోదాలో తాను రెండుస్లార్లు బండి సంజయ్కి ఫోన్ చేశానని, ఏ ఒక్కసారి హాజరుకాలేదన్నారు. ఆయన ఇప్పటికైనా అసత్యాలను ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ అభివృద్ధి కోసం ఈ సారి బడ్జెట్లో 200 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. సమావేశంలో కార్పొరేటర్లు గందె మాధవి, గంట కళ్యాణి, గుగ్గిళ్ల జయశ్రీ, నేతికుంట యాదయ్య, కుర్ర తిరుపతి, చాడగోండ బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.