కార్పొరేషన్, డిసెంబర్ 16: ‘కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీరని ద్రోహం చేసిండు. ఏదో చేస్తాడని ఎంపీగా గెలిపిస్తే నాలుగేండ్లలో ఒరగబెట్టిందేమీ లేదు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని, ఇంకా తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు యాత్రలు చేస్తున్నారే తప్ప దానికో అర్థం పర్థం లేదు’ కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నేతల వాఖ్యలను, ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని, సభ కోసం కళాశాల మైదానంలో 11 వేల కుర్చీలు వేస్తే 6 వేల మం దికి మించి జనం రాలేదన్నారు. బీజేపీ సభ పూ ర్తిగా విఫలమైందని, మాసిపూసి మారేడు కాయచేసి ప్రజలన్ని తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతున్నదని, బండి యాత్రలో ఉమ్మడి జిల్లా బీజేపీ ప్రజాప్రతినిధులు కనిపించలేదని, గుండు అరవింద్ అనేటోడు ఎక్కడికిపోయిండని, ఈటల కూడా రాలేదన్నారు. బీజేపీ నేతల తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ పదే పదే చాలా చీప్గా వంటకాల గురించి మాట్లాడుతున్నాడని, ఆయన ఏమైనా వంటలు చేస్తున్నారా..? అని ఎద్దేవా చేశారు. బండి చౌకబారు విమర్శలను ప్రజలు చీదరించుకునేలా ఉన్నాయని, సభలో ప్రజలకు ఏం చేస్తాననో చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు విశ్వాసం ఉన్న ఏకైక నేత కేసీఆర్ మాత్రమేనన్నారు. ప్రతి బీఆర్ఎస్ నాయకుడు, ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని, కానీ బీజేపీ నాయకులు ప్రజల్ని రెచ్చగొడుతూ లబ్ధి పొందేందుకు ప్రణాళికలు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా తప్పుడు, చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, వాల రమణారా వు, తోట రా ములు, గందె మాధవి, మహేశ్, బీఆర్ఎస్ నాయకులు అర్ష మల్లేశం, కాశెట్టి శ్రీనివాస్, ఉయ్యల శ్రీనివాస్గౌడ్, అనిల్కుమార్ పాల్గొన్నారు.
నడ్డా చెల్లని రూపాయి
బీజేపీ జాతీయ అధ్యక్షుడినని చెప్పుకునే జేపీ నడ్డా ఓ చెల్లని రూపాయి. దేశంలో ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలస్తే ఆయన జాడే ఉండదు. కేవలం మోదీ, అమిత్ షా మాత్రమే కనిపిస్తరు. సొంత రాష్ట్రంలోనే పార్టీని గెలిపించుకోలేనేడో ఇక్కడికి వచ్చి మాట్లాడుతుండు. ప్రజలెవరూ ఆయన్ను, ఆ పార్టీ నేతలను నమ్మ రు. కరీంనగర్ సభతోనే తేలిపోయింది. సభ కోసం కరీంనగర్లో ఆ పార్టీ నాయకులు కట్టి న బ్యానర్ల సంఖ్యంత జనం కూడా రాలేదు. సభ పూర్తిగా విఫలమైంది. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి.
– మేయర్ సునీల్రావు