కార్పొరేషన్, జూన్ 29:అభివృద్ధిలో కరీం‘నగరం’ దూసుకెళ్తున్నది. రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టితో స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటున్నది. రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు ఇలా ఒక్కటేమిటి ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులన్నీ సమకూర్చుకుంటున్నది. కొత్తగా సకల వసతులు, ఆధునిక ప్రమాణాలతో శాతవాహన యూనివర్సిటీ వద్ద మోడ్రన్ నైట్ ఫుడ్ కోర్టు, ఆధునిక వెజ్టేబుల్ మార్కెట్ నిర్మించాలని నగర పాలక సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే ప్రారంభం కాబోతుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఆకర్షణీయ నగరంగా మారుతున్న కరీంనగరంలో మరో అద్భుత నిర్మాణం జరుగబోతున్నది. నగర ప్రజల సౌకర్యార్థం శాతవాహన యూనివర్సిటీ వద్ద మోడ్రన్ నైట్ ఫుడ్ కోర్ట్, ఆధునిక వెజిటేబుల్ మార్కెట్ నిర్మించాలని నగర పాలక సంస్థ నిర్ణయించింది. త్వరలోనే నగర ప్రజలకు మోడ్రన్ నైట్ ఫుడ్ కోర్ట్, వెజిటేబుల్ మారెట్ అందుబాటులోకి తెస్తామని నగర మేయర్ యాదగిరి సునీల్రావు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం నగరంలోని భగత్నగర్లో గల క్యాంపు కార్యాలయంలో బల్దియా ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నైట్ ఫుడ్ కోర్ట్, మారెట్ డిజైన్ను పరిశీలించి వాటి ఏర్పాటుకు అధికారులకు సలహాలు, సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ వద్ద నైట్ ఫుడ్ కోర్ట్, మార్కెట్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసినట్లు తెలిపారు. నైట్ ఫుడ్ కోర్ట్కు సంబంధించి ఇంజినీరింగ్ అధికారులతో ప్రణాళికలు సిద్ధం చేసి డిజైన్లను కూడా రూపొందించినట్లు తెలిపారు. చకటి లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయడంతో పాటు సరిపడా సీటింగ్ కెపాసిటీ, పిల్లల కోసం ప్రత్యేకించి ఆట పరికరాలు, గ్రీనరీ, పూల మొకలతో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.
వ్యాపారులు వ్యాపారం చేసుకునే విధంగా సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. టెండర్ ప్రక్రియకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేసేందుకు బల్దియా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, ఈఈ మహేందర్, డీఈ వెంకటేశ్వర్లు, ఆర్వీ అధికారులు సందీప్, మురళీకృష్ణ పాల్గొన్నారు.