ముకరంపుర, జూన్ 29: సెంట్రల్ స్పోర్ట్స్ కౌన్సిల్ విద్యుత్ సౌధ ఆధ్వర్యంలో టీఎస్ ట్రాన్స్కో, డిస్కంలకు 2021-22సంవత్సరానికి నిర్వహించిన ఇంటర్ సర్కిల్ టోర్నమెంట్లలో ఉమ్మడి కరీంనగర్ సర్కిల్ ఉద్యోగులు ప్రతిభ చూపారు. ఉమ్మడి కరీంనగర్ సర్కిల్ ఉద్యోగులు ఫుట్బాల్, క్యారం, షటిల్, టగ్ఆఫ్వార్ పోటీల్లో 14పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచి సీఎండీ ట్రోఫీని గెలుచుకున్నారు. బుధవారం ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎండీ అన్నమనేని గోపాల్రావు, డైరెక్టర్లు బీ వెంకటేశ్వరరావు, పీ గణపతి, పీ సంధ్యారాణి, పీ మోహన్రెడ్డికి కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి ఎస్ఈలు గంగాధర్, సుదర్శన్, వేణుమాధవ్ సీఎండీ ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో సీజీఎం రాజుచౌహాన్, స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి ఈ ఎల్పీ రాజు, గేమ్స్ కార్యదర్శి జీ రాజ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.