వీణవంక, జూన్ 24: రాష్ట్రంలోని దళిత కాలనీలు ధనిక కాలనీలుగా మారాలని, ఇదే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చల్లూరు గ్రామంలో 11మంది లబ్ధిదారులు గ్రూప్గా ఏర్పడి రూ.1.10కోట్లతో కొనుగోలు చేసిన ఎర్త్మూవర్ వాహనాన్ని శుక్రవారం ప్రారంభించారు. కొండపాకలో ఈదునూరి రాధిక-శ్రీనివాస్ దళితబంధు కింద ఏర్పాటు చేసుకున్న రైస్ అండ్ ఆయిల్స్టోర్ షాప్ను ప్రారంభించారు. అంతకుముందు వీణవంక పోలీసుల ఆధ్వర్యంలో పోలీసులు-మీ కోసం కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో కాంపిటీటివ్ ఎగ్జామ్స్కు సన్నద్ధమవుతున్న 35మంది అభ్యర్థులకు స్టడీ మెటీరియల్, స్టడీచైర్, పరీక్ష ప్యాడ్లు, క్రీడాకారులకు 10 వాలీబాల్ కిట్లను హుజూరాబాద్ ఏసీపీ వెంకట్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు.
మామిడాలపల్లిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి బోనాలకు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా చల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం విజయవంతంగా పూర్తి కావస్తున్నదని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన దళితుల జీవితాల్లో దళితబంధు వెలుగులు నింపుతున్నదని వివరించారు. ఎంపి క చేసుకున్న యూనిట్ల ద్వారా లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలన్నారు. రాష్ట్రంలో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయని, యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమై ఉద్యోగాలు సాధించాలని సూచించారు.
కార్యక్రమాల్లో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, విండో చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, మాజీ చైర్మన్ మాడ సాదవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ వాల బాలకిషన్రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, ఎంపీడీవో శ్రీనివాస్, నీల కుమారస్వామి, సర్పంచులు పొదిల జ్యోతి-రమేశ్, ఆవాల అరుంధతి-గిరిబాబు, బండ సుజాత-కిషన్రెడ్డి, ఎంపీటీసీలు ఎలవేన సవిత-మల్లయ్య, మూల రజిత-పుల్లారెడ్డి, ఉపసర్పంచులు గెల్లు శ్రీనివాస్, రామగుండం రాజ్కుమార్, సంపత్రెడ్డి, వోరెం భానుచందర్, నాయకులు రాజయ్య, శ్యామ్, శ్రీనివాస్, రాములు తదితరులు పాల్గొన్నారు.