విద్యానగర్, జూన్ 24: సీ సెక్షన్ కాన్పులను తగ్గించి సాధారణ కాన్పులు చేసి కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. శుక్రవారం స్థానిక వీ కన్వెన్షన్ ఫంక్షన్హాల్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశ నోడల్ పర్సన్స్, అంగన్వాడీ కార్యకర్తలకు కలెక్టర్ అధ్యక్షతన ఏ షీల్డ్ యాప్పై ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. సీజనల్ వ్యాధులు, డెంగీ, మలేరియా, చికున్ గున్యా, ఫైలేరియా, రక్తహీనత, క్షయ నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొదటి, రెండో కొవిడ్ వ్యాక్సినేషన్ను 100 శాతం పూర్తిచేసి రాష్ట్రంలో జిల్లా మొదటిస్థానంలో ఉన్నందుకు అభినందనలు తెలిపారు. ఆశ కార్యకర్తలందరికీ హెచ్బీ టెస్ట్ కిట్ ఇస్తూ.. ఎలా వినియోగించాలో ప్రదర్శన ద్వారా వివరించారు. ఉత్తమ సేవలందించినవారికి ప్రశంసాపత్రాలు, బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జువేరియా, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, జిల్లా మలేరియా అధికారి రాజగోపాల్రావు, జిల్లా క్షయ నివారణ అధికారి రవీందర్రెడ్డి, జిల్లా ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, ఐసీడీఎస్ సీడీపీవోలు తదితరులు పాల్గొన్నారు.