కలెక్టరేట్, జూన్ 24: కరీంనగర్ బైపాస్రోడ్డులోగల ఆటోనగర్లో ఏర్పాటు చేసిన ఆపే షోరూంను సంస్థ జోనల్ మేనేజర్ దివాకర్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలుదారుకు సీఎన్జీ ఆటోను అందజేశారు. అనంతరం దివాకర్రెడ్డి మాట్లాడుతూ.. నాణ్యత, నమ్మకానికి మారుపేరు ఆపే ఫియాజియో ఆటో అని పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి తక్కువ ఖర్చుతో ఎక్కువ సేవలందిస్తూ, వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్నదని తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో తయారవుతున్న ఆటోలు ప్యాసింజర్, ట్రాలీ విభాగాల్లో ఆటోమొబైల్ మార్కెట్లో నూతన విప్లవానికి నాంది పలికాయని పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభించిన ఈ షోరూం ఉమ్మడి జిల్లా పరిధిలోని జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల వినియోగదారులకు నిరంతర సేవలందించనున్నట్లు వెల్లడించారు. ట్రాలీ విభాగంలో ఐదు, ఐదున్నర, ఆరు ఫీట్ల వెడల్పులో కూడా అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరల దృష్ట్యా సీఎన్జీతో నడిచే వాహనాలు కూడా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. అంతకుముందు షోరూం మేనేజింగ్ డైరెక్టర్ మెట్పల్లి ప్రదీప్కుమార్, గండ్ర శేఖర్రావు జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో షోరూం జనరల్ మేనేజర్ ఎన్.వెంకటరమణారెడ్డి, సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.