కరీంనగర్ కలెక్టరేట్, జూన్9: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం ప్రభుత్వం ప్ర త్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న అటవీశాతాన్ని మరింత పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నది. రాష్ట్రంలో పచ్చదనం తకువగా ఉన్న జిల్లాల్లో కరీంనగర్ మొదటి స్థానంలో ఉంది. జిల్లాలో 0.15 శాతం మాత్రమే అటవీ సంపద ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నా యి. కాగా, స్వరాష్ట్రం సిద్ధించిన అనంతరం ఏడేళ్లు గా హరితహారం చేపడుతూ, నిర్ధిష్ట లక్ష్యం మేరకు ప్రభుత్వం మొక్కలు నాటుతున్నది. ప్రధానంగా చిట్టడవుల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గతేడాది నుంచి ప్రభుత్వ భూమిలో మండలానికి ఒక బృహత్ పల్లె ప్రకృతి వనం(బీపీపీవీ) ఏర్పాటు చేయాలని యంత్రాంగాన్ని పురమాయించింది. ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించి, అభివృద్ధి చేస్తుండడంతో అనతికాలంలోనే ఏపుగా పెరిగాయి. దీనిస్ఫూర్తితో మండలానికి మరో నాలుగు బీపీపీవీలను ఒక్కోటి ఐదెకరాల స్థలంలో ఏర్పాటు చేయాలంటూ సూచించడంతో, ఆ దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
15వేల మొక్కలతో ఏర్పాటు..
బీపీపీవీ ఏర్పాటులో భాగంగా అయిదెకరాల స్థ లంలో వివిధ రకాలైన 15వేల మొక్కలు నాటేందు కు కార్యాచరణ చేపట్టారు. నేరేడు, చింత, సీతాఫ లం, మారేడు, తంగేడు, వేప, జామ, రేగు, దాని మ్మ, రావి, గుల్మెహర్, రామసీతాఫలం, మామిడి, టేకు, వెదురు, పైడి తంగేడు, కానుగ, టేకోమా, నిమ్మ, పనసచెట్లతో పాటు భారీ సైజు వృక్షాలు ఎదిగే మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 313 గ్రామపంచాయతీల్లో ఇప్పటికే పల్లె ప్రకృతి వనం (పీపీవీ)లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో నీడనిచ్చే మొకలతో పాటు స్థానిక పంచాయతీలకు ఆదాయాన్నిచ్చే వివి ధ రకాల పండ్ల మొకలు పెంచుతున్నారు. ఆపిల్ బేర్, డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ, జామ, రేగు, నేరే డు, సీతాఫలం, తదితర మొకలు నాటారు. వీటికి నిరంతరం నీటి సరఫరా చేస్తూ, సంరక్షిస్తున్నారు. అలాగే, ఈ పీపీవీల్లో వాకింగ్ ట్రాక్లు, కొన్ని చోట్ల ఓపెన్ జిమ్లు కూడా ఏర్పాటు చేయగా, పల్లె జనం ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తుండగా, ఇదే క్రమంలో మండలానికి ఒక బీపీపీవీ ఏర్పాటు చేసింది. అయితే కొత్తగా మండలానికి మరో నాలుగింటిని ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది.
రంగంలోకి యంత్రాంగం
ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు ప్రభుత్వ స్థలాలను గుర్తించే పనిలో పడ్డారు. ముఖ్యంగా ప్రభుత్వ బంజరు, పరంపోగు, బంచరాయి భూములతో పాటు ఎస్సారెస్పీ, వరద కాలు వ భూములు కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే 15 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఉండగా, మూడు నెలల క్రితమే మరో 15 బీపీపీవీల కోసం స్థలాలు ఎంపిక చేశారు. అయితే రాష్ట్ర సర్కారు మరో 45 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని సూచించగా, స్థల ఎంపికలో అధికారులు బీజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే ఇల్లందకుంట, గంగాధర, గన్నేరువరం, చొప్పదండి, తిమ్మాపూర్ మండలాల్లో ప్రభుత్వ స్థలాల పరిశీలన కూడా చేసి, ఎంపిక చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పల్లె ప్రగతి ప్రారంభమైన నేపథ్యంలో స్థలాల ఎంపిక పూర్తయిన చోట్ల మొక్కలు నాటేందుకు సమాయత్తమవుతున్నారు. వచ్చే ఏడాది వరకు వీటిని సక్రమంగా సంరక్షిస్తే ఏపుగా పెరిగి అటవీ విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలుంటాయని అధికారులు పేర్కొంటున్నారు.