మణుగూరు టౌన్, జూన్ 5: గ్రా మాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ కారం విజయకుమారి, జడ్పీటీసీ పోశం నర్సింహారావు అన్నారు. ఆదివారం మండలంలోని ముత్యాలమ్మనగర్లో పల్లెప్రగతి పనులను పరిశీలించారు. మణుగూరులో మున్సిపల్ కమిషనర్ కే మాధవి పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు, కోఆప్షన్ సభ్యుడు ఎండీ జావీద్పాషా, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ సిబ్బంది, హెల్త్ వర్కర్లు పాల్గొన్నారు.
పర్ణశాలలో..
పర్ణశాల, జూన్ 5: మండలంలో జరుగతున్న పల్లెప్రగతి పనులను ఆదివారం ఎంపీవో ముత్యాలరావు పరిశీలించారు. మండలంలోని అన్ని పంచాయతీల్లో భగీరథ ట్యాంకుల క్లీనింగ్, పారిశుధ్య పనులు నిర్వహించినట్లు తెలిపారు. సర్పంచ్లు, కార్యదర్శులు, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
ఆళ్లపల్లిలో..
ఆళ్లపల్లి, జూన్ 5: పల్లె ప్రగతిలో భాగంగా పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలని భద్రాద్రి జిల్లా ఆడిట్ అధికారి, పల్లెప్రగతి ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అనంతోగు, ఆళ్లపల్లి, మర్కోడు పంచాయతీల్లోని మురుగు కాల్వలు, వాటర్ ట్యాంక్లను శుభ్రం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు సమ్మక్క, కోటేశ్వరరావు, శంకర్బాబు, ఉప సర్పంచులు కమల, వినోద, మర్కోడు ప్రత్యేక అధికారి ఏవో అశోక్, ఎంపీడీవో మంగమ్మ పాల్గొన్నారు.
బూర్గంపహాడ్లో..
బూర్గంపహాడ్, జూన్ 5: గ్రామాల అభివృద్ధిలో ప్రతిఒక్కరూ తమవంతు సహాయ సహకారాలు అందించాలని జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. ఆదివారం బూర్గంపహాడ్లో జరుగుతున్న పల్లెప్రగతి పనులను జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, తహసీల్దార్ భగవాన్రెడ్డి, ఎంపీడీవో వివేక్రామ్, సర్పంచ్ సిరిపురం స్పప్న, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ పల్లెప్రగతిలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం, నాయకులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.