ఖమ్మం లీగల్, జూన్ 5: విరివిగా మొక్కల పెంచి పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని జిల్లా జడ్జి డాక్టర్ తట్టా శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ నగరంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. మొక్కల పెంపకంతోనే కాలుష్య నివారణ సాధ్యమన్నారు. ప్రజలు ప్లాస్టిక్ను నివారించాలన్నారు. జిల్లా అటవీ అధికారి బి.ప్రవీణ, న్యాయసేవా సంస్థ న్యాయమూర్తి జావీద్ పాషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు మాట్లాడుతూ.. ఉన్నది ఒకటే భూమి అని, దానిని కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.