తెలంగాణలోని పల్లెలు, పట్టణాలను సకల వసతులు కల్పించి అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని ప్రజాప్రతినిధులు ఉద్ఘాటించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలతోపాటు అన్ని గ్రామాల్లో ప్రత్యేకాధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు పర్యటించారు. స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు గుర్తించడంతో పాటు 15 రోజుల పాటు కొనసాగనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.
హుజూరాబాద్ పట్టణంలో..
హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో 29, 16, 27వ వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం ఆయనతోపాటు చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకొని రావాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో బల్దియా ప్రత్యేక అధికారి, జేడీఏ శ్రీధర్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్యాదవ్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు మారేపల్లి శ్రీనివాస్, సుశీల, వీ వెంకట్రెడ్డి, ముక్క రమేశ్, తాళ్లపెల్లి శ్రీనివాస్, విజయ, లత, ప్రత్యేకాధికారి అశ్వినిగాంధీ, ఉద్యోగులు పాల్గొన్నారు.
జమ్మికుంట పట్టణంలో..
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, కొత్తపల్లిలో వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్నాకోటి, కమిషనర్ సమ్మయ్య ప్రారంభించారు. కార్యక్రమానికి ప్రత్యేకాధికారి రమేశ్బాబు హాజరయ్యారు. వార్డుల్లో ర్యాలీ తీశారు. ఇంటింటికీ తిరిగారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను స్వీకరించారు. మొదటి ప్రాధాన్యత కింద గుర్తించిన అభివృద్ధి పనులను చేపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది, స్థానిక కాలనీవాసులున్నారు.
హుజూరాబాద్ మండలంలో..
హుజూరాబాద్ రూరల్, జూన్ 3: మండలంలోని పలు గ్రామాల్లో ఐదో విడుత పల్లెప్రగతిలో భాగంగా పంచాయతీ పాలకవర్గాల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. గత నాలుగు విడుతల్లో గ్రామాల్లో చేపట్టిన, ప్రస్తుతం చేపట్టాల్సిన పనుల గురించి చర్చించారు. కార్యక్రమంలో అయా గ్రామాల సర్పంచులు, ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇల్లందకుంట మండలంలో..
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని 19 గ్రామాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు పాదయాత్ర చేశారు. గ్రామ సభలను నిర్వహించి పల్లె ప్రగతి కింద వచ్చిన నిధులు, ఖర్చులు, మిగులు నిధుల వివరాలను అధికారులు చదివి వినిపించారు. కార్యక్రమంలో సర్పంచులు రజితావాసుదేవరెడ్డి, మొగిలి, ఎల్లారెడ్డి, సరోజన, మానస, వనమాల, అరుణ, దిలీప్రెడ్డి, రఫీఖాన్, మల్లయ్య, ఆదిలక్ష్మి, సాంబయ్య, శ్రీలత, మండల ప్రత్యేకాధికారులు డీటీ రాజేశ్వరి, ఏవో రజిత, ఏఈవోలు సంపత్, మహేందర్ వైద్యురాలు జ్యోత్స్న, పంచాయతీ కార్యదర్శులు కిషన్, రాజేశ్, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, సంధ్య, స్వప్న, రమేశ్తో పాటు వివిధ శాఖల సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
సైదాపూర్ మండలంలో..
మండలకేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ర్యాలీలు నిర్వహించారు. ఊరూరా పల్లె ప్రగతిలో చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించారు. వివిధ గ్రామాల్లో ఇంకుడు గుంతల పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రేమ్ సాగర్ రావు, ఎంపీవో రాజశేఖర్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
జమ్మికుంట మండలంలో..
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచులు, ప్రత్యేకాధికారులు, అధికారులు పాదయాత్ర నిర్వహించారు. గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామంలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఎంపీపీ దొడ్డె మమత, వైస్ ఎంపీపీ పొల్సాని తిరుపతిరావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాదిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షురాలు కడవేర్గు మమత , సర్పంచులు కడిపికొండ రాజిరెడ్డి, రాచపల్లి సదయ్య, గిరవేన రమారాజయ్య, బొజ్జం కల్పనాతిరుపతిరెడ్డి, మూగల పరశురాములు, చందుపట్ల స్వాతీకృష్ణారెడ్డి, సుంకిశాల పద్మ, వజ్జెపల్లి ఆగయ్య, కాట్మండి మహేందర్, ఇల్లందుల అన్నపూర్ణ, పుప్పాల శైలజారాజారాం, ఆకినపల్లి సుజాతాభద్రయ్య, చిలుముల వసంతారామస్వామి, జక్కెన శ్రీలతాసత్యనారాయణ, బోయిని రాజ్కుమార్, పింగిళి రమాదేవి, పోతరవేన రాజ్కుమార్, ఎంపీటీసీలు తోట కవితాలక్ష్మణ్, మర్రి మల్లేశం, రాచపల్లి రాజయ్య, సంపెల్లి స్వరూప, వాసాల నిరోష, కోఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీతో పాటు పంచాయతీ కార్యదర్శులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.