కరీంనగర్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): “పల్లెలు పట్టణాలుగా మారాలి, పట్టణాలలో ఆధునీకరణ జరగాలి, అది చూసి ప్రజలు మురువాలి” అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన ఐదో విడుత పల్లె ప్రగతి, 4వ విడుత పట్టణ ప్రగతి జిల్లా స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 3 నుంచి 15 రోజులపాటు నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పాల్గొని విజయ వంతం చేయాలన్నారు. అధికారులు చురుగ్గా, జవాబుదారీ తనంతో పనిచేయాలని సూచించారు.
ప్రతి ఒకరూ క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామాన్ని సందర్శించాలని, అవసరమైతే ప్రజాప్రతినిధులు పల్లెనిద్ర చేయాలని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని, పేరుకుపోయిన సమస్యలపై ఒక ఎజెండా తయారు చేసుకొని ముందుకు సాగాలన్నారు. అందరం కలిసి కట్టుగా పల్లె ప్రగతిని విజయవంతం చేద్దామని, పల్లె ప్రగతి ద్వారా దేశంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుదామని పిలుపు నిచ్చారు. దేశంలో మన రాష్ట్రాన్ని, మన గ్రామాలను నంబర్ వన్గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దని స్పష్టం చేశారు.
పల్లె ప్రగతి మొదటి రోజు గ్రామాల్లో పాద యాత్రలు, పల్లె ప్రగతి గురించి ప్రజలకు తెలిసేలా ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పంచాయతీలన్నీ పల్లె ప్రగతికి ముందు, పల్లె ప్రగతికి తర్వాత అనేలా తయారయ్యాయని చెప్పారు. నాలుగు విడతల పల్లెప్రగతిలో ఇప్పటి వరకు నాటిన మొకలు బతికేలా, వైకుంఠధామాలను వినియోగించుకొనేలా చూడాలని, పారి శుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన పల్లెల్లో మార్పు వచ్చిందని, గ్రామాల్లో పది శాతం గ్రీనరీ నిధులతో పెద్దఎత్తున మొకలు నాటామని, అవన్నీ ఎండలకు ఎండిపోకుండా నీళ్లు పోసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.285 కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు.
గ్రామాల్లో నిర్మించిన వైకుంఠ ధామాలు కొన్ని వినియోగంలోకి రాలేదని, వాటికి కరెంటు, నీటి వసతి అందించేలా చూసి, వినియోగంలోకి తేవాలని కోరారు. దేశంలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో 20 ఉత్తమ గ్రామాలను కేంద్రం ఎంపిక చేయగా, వాటిలో 19 తెలంగాణకు చెందినవే కావడం గర్వకారణమన్నారు. హరిత హారం, పల్లెప్రకృతి వనాల వల్ల రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం 7.7 శాతం పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలు, సురక్షిత మంచినీటి సరఫరా, నర్సరీల ఏర్పాటు, వైకుంఠధామాల నిర్మాణంతో పాటు ప్రతి పల్లెలో ఎకరా స్థలంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా ప్రతి గ్రామం ఆదాయం పొందాలని సూచించారు. రాష్ట్రంలోని 12 వేల గ్రామాల్లో ఐదు వేల పంచాయతీలు ట్రాక్టర్ల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్నాయని అన్నా రు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేలా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. ఉత్తమంగా నిర్వహించిన ప్రజాప్రతినిధులకు అవార్డులు అందజేస్తామని ప్రకటించారు. గతేడాది చేపట్టిన కార్యక్రమాలతోపాటు రానున్న ఏడాదిలో చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
సెల్ఫోన్లకు అతుక్కుపోవద్దనే క్రీడా ప్రాంగణాలు: బోయినపల్లి వినోద్ కుమార్
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, తెలంగాణ గ్రామీణ, పట్టణ ప్రాంతాలు దేశంలోనే ముందు వరుసలో ఉన్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలపారు. సెల్ఫోన్లకు అతుకుపోతు న్న నేటి యువతను మార్చేందుకు, కనుమరు గవుతున్న గ్రామీణ ఆటలకు ప్రాణం పోసేందుకు ప్రతి గ్రామంలో, పట్టణంలో క్రీడాప్రాం గణాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు.
సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై అధికారులకు పూర్తి అవగాహన, స్పష్టత కలిగి ఉండాలని సూచించారు. రాష్ట్రంలో నిధుల కొరత లేదని, ఈ నెల 3 నుంచి 15 రోజుల పాటు నిర్వహించను న్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల న్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వొడితల సతీశ్ కుమార్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, మేయర్ వై సునీల్రావు, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యాంప్రసాద్ లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, డీపీవో వీర బుచ్చయ్య, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సేవా ఇస్లావత్ పాల్గొన్నారు.