బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డికి
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ సవాల్
హుజూరాబాద్టౌన్, మే 28: ధైర్యం, దమ్ము ఉంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినేత రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధినేత బండి సంజయ్ తమ పదవులకు రాజీనామా చేసి ప్రజల్లోకి తేల్చుకునేందుకు ముందుకు రావాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ సవాల్ విసిరారు. శనివారం హుజూరాబాద్లోని ఆయన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. రేవంత్రెడ్డి అహంకారంతో ఏకపక్షంగా మాట్లాడుతూ రెడ్లపై ఉన్న గౌరవం ఇతర కులాలకు లేకుండా చేస్తున్నాడని, ఎన్నికలపుడు చుట్టపు చూపుగా వచ్చే రేవంత్రెడ్డి నిన్న మొన్న వచ్చిన పదవితో కొత్త బిచ్చగాడి వలె ఎగిరెగిరి పడుతున్నాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మూడు సీట్లకు మించి గెలువని పార్టీలుగా చరిత్రలో నిలిచిపోతాయని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణకే కాకుండా యావత్ భారత దేశానికి సేవ చేసే సత్తా ఉన్న జాతీయ నాయకుడిగా ఎదుగుతుండడంతో కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెల్లో దడ పుడుతున్నదన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలతో టీఆర్ఎస్ నేతలు ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి మళ్లీ అఖండ మెజారిటీతో గెలిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారో స్పష్టం చేయాలని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు దేశంలోని ఆ పార్టీల పాలన లో ఉన్న రాష్ట్రాల్లో ప్రవేశ పెట్టే దమ్ముందా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు కులాలు, మతాలను రెచ్చగొట్టి పబ్బం గడపడం తప్ప ప్రజల మధ్య ఐక్యత పెంచి అభివృద్ధి చెందేలా చూసే తీరికలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలోని సంపదను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నుల రూపేణా దోచుకుపోతున్నదన్నారు.
రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా, ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించకుండా ప్రజలతో రాజకీయం చేయాలని చూస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్ని కుటుంబ పాలన అని ఎద్దేవా చేసే వారు జీవితంలో ఒకటి గుర్తుంచుకోవాలన్నారు. ప్రజల నుంచి పుట్టుకొచ్చి, ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజాప్రతినిధులుగా ఎదిగిన వారే కానీ వారసత్వ పాలనగా వారికి పదవులు రాలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు చేసిన కేసీఆర్ కుటుంబం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. చావు అంచుల దాకా పోయి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను తెలంగాణ జాతిపితగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారన్నారు.
కేసీఆర్ చేపడుతున్న అనేక ప్రజా సంక్షేమ పథకాలతో అన్ని పార్టీలకు దడ పుడుతున్నదన్నారు. కేసీఆర్ను ఎదురొనే సత్తా లేకనే ప్రజల్లో విద్వేషాలు సృష్టిస్తూ ఓట్లను రాబట్టుకోవాలని చూస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని పేరొన్నారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించే కాంగ్రెస్, బీజేపీ అధినేతలు రేవంత్రెడ్డి, బండి సంజయ్ను తెలంగాణ ప్రజలు విశ్వసించడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు చేపడుతున్న సంక్షేమం పట్ల ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు.