సిరిసిల్ల రూరల్, మే 28: మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని, రాష్ర్టానికి భారీ పెట్టుబడులు సాధించి తిరి గి రావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా యి. ఈ మేరకు తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు గుగ్గిల్ల సంజీవ్గౌడ్ ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ విగ్ర హం ఎదుట సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. మంత్రి కేటీఆర్ ఎకనామిక్స్ ఫోరం సమావేశం పాల్గొనడంతోపాటు లండన్లో వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో రూ.4200 కోట్ల పెట్టుబడులు సాధించారని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధితోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేటీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, ఎంపీపీ పడిగెల మానస, సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్రెడ్డి, సిరిసిల్ల పీఏసీఎస్ చైర్మన్ బండి దేవదాస్గౌడ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు వల్లకొండ వేణుగోపాలరావు, ఎంపీటీసీలు సిలువేరి ప్రసూన, కర్కబోయిన కుంటయ్య, టీఆర్ఎస్ నేతలు పడిగెల రాజు, పుర్మాణి రాంలింగారెడ్డి, ఆవునూరి వెంకటరాములు, సిలువేరి చి రంజీవి, నక్కప్రేమ్, టీఆర్ఎస్ఎస్సీ సెల్ మండ లాధ్యక్షుడు సిలువేరి సంజీవ్, కొక్కిరాల ఆగంరావు, మాజీ సర్పంచ్ పొన్నం లక్ష్మణ్, సూర్యారావు, సత్యనారాయణ ఉన్నారు.