జూలపల్లి, మే 26: విద్యార్థులు, యువతీ యువకులు మహాత్మా జ్యోతిరావుఫూలే బాటలో నడవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. బాలరాజ్పల్లిలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్లాంటి ఎందరో మహనీయులు ఫూలేను ఆదర్శంగా తీసుకుని సమాజానికి జీవితాలు ధారపోశారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఫూలే ఆశయాలు సాకారం చేసే దిశగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఇక్కడ ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, వైస్ ఎంపీపీ మొగురం రమేశ్, ఏఎంసీ చైర్మన్ కంది చొక్కారెడ్డి, సర్పంచులు కుంటూరి రాజయ్య, దారబోయిన నరసింహం, మేచినేని సంతోష్రావు, ఈర్ల మల్లేశం, ఎంపీటీసీ సభ్యులు తమ్మడవేని మల్లేశం, దండె వెంకటేశం, ధూళికట్ట సింగిల్ విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్రావు, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కుంట రాజేశ్వర్రెడ్డి, నాయకులు నల్ల మనోహర్రెడ్డి, అడువాల తిరుపతి, కొత్త రవీందర్, తొంటి బుచ్చయ్య, తోట ముత్తులింగం, లాల్మహ్మద్, కోరుకంటి మల్లయ్య, గడ్డం రాజేశ్వర్రెడ్డి, కొప్పుల అజిత్ పాల్గొన్నారు.
ఊషన్నపల్లెలో ఎమ్మెల్యే పూజలు
కాల్వశ్రీరాంపూర్, మే 26: గంగారం పరిధి ఊషన్నపల్లెలో గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ఠాపన ముగింపు సందర్భంగా గురువారం పోచమ్మ బోనాలు నిర్వహించారు. వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ కదురు మానస సతీశ్, విండో చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కొట్టె సుజాత-రవీందర్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ నిదానపురం దేవయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ ముస్కు మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ ఈద సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.