గంగాధర, మే 26 ; కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాక్షాత్కరిస్తున్నాయి. మండుటెండల్లోనూ భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయి. మెట్ట ప్రాంతంలోని బావుల్లో ఒకప్పుడు వంగి చూసినా కనబడని నీళ్లు ఇప్పుడు దోసిలికి అందేలా ఉప్పొంగుతున్నాయి. ఒకప్పుడు తీవ్ర కరువు ప్రాంతమైన గంగాధర మండలంలో ఇప్పుడు ఎక్కడ చూసినా జలాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గట్టుభూత్కూర్ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి ఇలా పూర్తిగా నిండి నీళ్లు బయటకు వస్తుండగా, యువత ఈత కొడుతూ కేరింతలతో సరదాగా గడుపుతున్నది.