అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో బిజీగా ఉండే ఎమ్మెల్యే రవిశంకర్.. కొద్ది రోజులుగా ప్రభుత్వ పథకాల ఫలాలను లబ్ధిదారులకే నేరుగా అందిస్తున్నారు. మంగళవారం బోయినిపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లి ఆర్అండ్ఆర్ కాలనీల్లో 11 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి చెక్కులు అందించగా, ఆడబిడ్డలు అపూర్వ స్వాగతం పలికారు. చక్కెర కుడుకలు పోసి, ఆత్మీయతను చాటుకోగా, నిరుపేదల అభ్యున్నతే సర్కారు లక్ష్యమని సుంకె పేర్కొన్నారు.
బోయినపల్లి, మే 24: నిరుపేదలకు తెలంగాణ సర్కారు అండగా ఉంటుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ రాష్ట్ర నేత జోగినపల్లి రవీందర్రావుతో కలిసి కొదురుపాక, నీలోజిపల్లి ఆర్అండ్ఆర్ కాలనీల్లో 11 మంది కల్యాణలక్ష్మి లబ్ధి దారుల ఇండ్లకు వెళ్లి చెక్కులు అందించారు. ఆయన సతీమణి దీవెన పంపించిన చీరెలను పంపిణీ చేశారు. కాగా, లబ్ధిదారుల కుటుంబీకులు మంగళహారతులు ఇచ్చి, పూలు చల్లి స్వాగతం పలికారు. పలువురు చక్కెర కుడుకలు పోశారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలతో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడ్డదన్నారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. బీజేపీ కాంగ్రెస్ నాయకులకు ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్పై విమర్శలు చేసే అర్హతలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, డీటీ నవీన్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, లెంకల సత్యనారాయణరెడ్డి, సర్పంచ్ చిందం రమేశ్, బూర్గుల నందయ్య, జిల్లా నేతలు అనుముల భాస్కర్, నేతలు చిక్కాల సుధాకర్రావు, నాగుల నాగరాజు, గుంటి శంకర్, ఒజ్జల మహేందర్, కవ్వంపల్లి రాములు, కొండం నారాయణరెడ్డి, కమల్, సందిల దేవయ్య, పెండ్యాల మహిపాల్ రెడ్డి ఉన్నారు.
‘ప్రభుత్వం పని తీరు ఎలా ఉన్నది.. సీఎం కేసీఆర్ పాలన బాగున్నదా? పింఛన్లు వస్తున్నాయా, ఆరోగ్యం ఎలా ఉంది.. విద్యుత్ సరఫరాలో ఏమైనా అంతరాయం కలుగుతున్నదా’ అని ప్రజలు, వృద్ధులు, రైతులను ఎమ్మెల్యే రవిశంకర్ అడిగి తెలుసుకున్నారు. చెక్కుల పంపిణీ అనంతరం ఆయా గ్రామాల్లో పర్యటించారు. వృద్థులు, మహిళలు, యువకులు రైతులు కనిపించగా వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా కొందరు నిరుద్యోగులు ఇండ్లవద్దే ఖాళీగా ఉంటున్నామని చెప్పగా, జోగినపల్లి రవీందర్రావు స్పందించారు. ప్రైవేట్ కంపెనీల్లో కొలువులు చేయాలని, అవసరమైతే తాను సాయం చేస్తానని భరోసానిచ్చారు.