3వేల మందికి పైనే..
వేసవి శిక్షణా శిబిరానికి విశేష స్పందన వస్తున్నది. ఉదయం 6 నుంచి 8 గంటల దాకా ట్రైనింగ్ ఇస్తుండగా, దాదాపు 3వేల మందికిపైనే పాల్గొంటున్నారు. కరాటేతో పాటు క్రికెట్, చెస్, ఫుట్బాల్, వాలీబాల్ క్రీడల్లో ఎక్కువ మంది శిక్షణ పొందుతుండగా, చిన్నారులతో పాటుగా పెద్దలు సైతం వచ్చి వాకింగ్, ఓపెన్ జిమ్లో శిక్షణ తీసుకోవడం విశేషం. అయితే ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నవారికి జూన్ 6 నుంచి 9 మధ్య పలు విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంకా శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరికీ నగరపాలక సంస్థ, జిల్లా యువజన క్రీడాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు కూడా ఇవ్వనున్నారు.
కొత్తపల్లి, మే 22 : చిన్నారుల్లో దేహదారుఢ్యాన్ని పెంచి, క్రీడల్లో మెరికల్లా తయారు చేసేందుకు కరీంనగర్లో కొన్నేళ్లుగా సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లు నిర్వహించకపోగా, ఈ ఏడాది కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా యువజన, క్రీడాశాఖ సహకారంతో శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన క్యాంపు వచ్చే నెల 9వ తేదీతో ముగియనుండగా, అంబేద్కర్ స్టేడియంతో పాటు మానేరు హైస్కూల్, కోర్టు సమీపంలోని క్రీడా ప్రాంగణం, మానేరు డ్యాం వద్ద 25 క్రీడాంశాల్లో ఉదయం 6 నుంచి 8 గంటల దాకా శిక్షణ ఇస్తున్నారు.
ఉచితంగా పోషకాహారం
క్రీడా శిక్షణ శిబిరాలు నాలుగు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. మెజార్టీ క్రీడలపై అంబేద్కర్ స్టేడియంలో శిక్షణ నడుస్తుండగా, మానేరు హైస్కూల్లో జూడో, విద్యుత్ శాఖ మైదానంలో బ్యాడ్మింటన్, మానేరు డ్యాంలో కనోయింగ్, కయాకింగ్పై శిక్షణ ఇస్తున్నారు. కాగా, శిక్షణ తీసుకునే చిన్నారులకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రోజూ ఉచితంగా కోడిగుడ్డు, అరటిపండు. పాలను ఇస్తున్నారు.
25 క్రీడాంశాల్లో శిక్షణలు
శిబిరంలో 25 క్రీడాంశాల్లో తర్ఫీదునిస్తున్నారు. అర్చరీ, అథ్లెటిక్స్, బాడ్మింటన్, బేస్బాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్, చెస్, క్రికెట్, సైక్లింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, కరాటే, ఖోఖో, కిక్ బాక్సింగ్, స్పీడ్బాల్, తైక్వాండో, వాలీబాల్, వాటర్ స్పోర్ట్స్, రెజ్లింగ్, ఉషు, యోగా క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. అయితే మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్రావు సూచనల మేరకు స్కేటింగ్లోనూ ట్రైనింగ్ ఇస్తుండగా, పెద్ద సంఖ్యలో చిన్నారులు ఇదే క్రీడను ఎంచుకున్నారు.
సామాజిక బాధ్యతగా శిబిరాలు..
ఫిట్నెస్, క్రీడల ప్రాముఖ్యతను విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియజేసేం దుకే కార్పొరేషన్ ఆధ్వర్యంలో సామాజిక బాధ్యతగా ఏటా వేసవి క్రీడా శిబిరాలను నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు మూడుసార్లు కొనసాగగా, కరోనా కారణంగా గత రెండేళ్లు నిర్వహించలేకపోయాం. శిబిరాల నిర్వ హణకు అవసరమైన క్రీడా సామగ్రిని సుమారు రూ.8 లక్షలతో కొనుగో లు చేసి క్రీడాశాఖాధికారులకు అందించాం. అలాగే శిక్షణ తీసుకుంటు న్న చిన్నారులకు పోషకాహారంగా పాలు, గుడ్డు, అరటి పండ్లను అంద జేస్తున్నాం. క్రీడల్లో రాణించే వారికి ప్రోత్సాహకం కూడా అందిస్తాం.
– వై సునీల్రావు, మేయర్
క్రీడలపై ఆసక్తి పెరిగింది..
వేసవి శిబిరాలతో క్రీడలపై ఆసక్తి పెరిగింది. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు చదువుతో పాటుగా క్రీడలూ ముఖ్యమే. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతాయి. ఆరోగ్యంగా, ఫిట్గా ఉన్నప్పుడే ఏదైనా సాధించే సత్తా, ఆత్మస్థయిర్యం పెరుగుతుంది. నిపుణులైన కోచ్ల సమక్షంలో శిబిరాలు సజావుగా కొనసాగుతున్నాయి.
– డీవైఎస్వో కే రాజవీరు
స్కేటింగ్లో రెట్టింపు ఉత్సాహం
చిన్నారులు ముఖ్యంగా స్కేటింగ్పై ఆసక్తి చూపుతున్నారు. 300 మందికిపైనే దరఖాస్తు చేసుకున్నారు. స్కేటింగ్ నిర్వహణ వ్యయంతో కూడినది కావడంతో పే అండ్ ప్లే పద్ధతిలో శిక్షణ ఇస్తారు. కానీ విద్యార్థుల స్పందనను చూసిన మంత్రి గంగుల, మేయర్ సునీల్రావు సూచనలతో స్కేటింగ్లో సైతం ఉచితంగానే ట్రైనింగ్ ఇస్తున్నాం.
– గట్టు అనిల్, సీనియర్ స్కేటింగ్ కోచ్
యుద్ధ క్రీడ ఉషుకు ఆదరణ
యుద్ధ క్రీడ ఉషుకు చిన్నారుల స్పందన బాగుంది. సుమారు 100 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒలింపిక్ క్రీడైన ఉషులో రాణించేవారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయి. ఫిట్నెస్ మెరగవుతుంది. గత సమ్మర్ క్యాంపులో శిక్షణ తీసుకున్న వారు సైతం ఇప్పుడు శిక్షణ తీసుకుంటున్నారు.
– కోడూరి శేఖర్, ఉషు కోచ్
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
సమ్మర్ క్యాంప్లో యోగా చేర్చడం సంతోషంగా ఉంది. అన్ని వయస్సుల వారు సులువుగా నేర్చుకోవచ్చు. సుమారు 100 మంది దరఖాస్తు చేసుకున్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులకు యోగా దివ్యాఔషధంగా పనిచేస్తుంది.
-మల్లికా, జాతీయ యోగా క్రీడాకారిణి
చెస్ నేర్చుకుంటున్నా..
నాకు చెస్ అంటే చాలా ఇష్టం. అందుకే క్యాంపు లో చెస్ నేర్చుకుంటున్నాను. మా కోచ్ కంకటి కనకయ్య సార్ బాగా శిక్షణ ఇస్తున్నారు. పలు సార్లు గెలిచాను కూడా. కొత్త ఫ్రెండ్స్ అయ్యారు. వారితో పోటీపడి మరీ చెస్ ఆడుతున్నా. స్కూల్ ప్రారంభమైన తర్వాత కూడా శిక్షణ తీసుకుంటా.
– ఎం ప్రశష్ఠ, చిన్నారి