గంగాధర, మే 22: మండలంలోని బూరుగుపల్లి గ్రామానికి చెందిన రాగం గంగయ్య -మల్లమ్మల కూతురూ రాగం హారిక ఏడు నెలల గర్భిణి.. ఈ నెల 28న శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం తో కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ దవాఖానలో చేర్పించారు. శనివారం హారిక పరిస్థితి మ రింత విషమంగా మారడంతో ఆపరేషన్ చేసి కాన్పుచేయగా బిడ్డ జన్మించింది. ఆపరేషన్ చేసిన గంటలోపే తల్లి, బిడ్డ హార్ట్బీట్ తగ్గిపోవడంతో మె రుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసువెళ్లాలని వైద్యులు సూచించారు. శనివారం అర్ధరాత్రి హారికను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం హారికకు వెంటిలేటర్పై చికిత్స అందజేస్తున్నారు. అయితే అప్పుడే పుట్టిన బిడ్డకు కరీంనగర్లో చికిత్సను అందజేస్తున్నారు. ఇద్దరి పరీస్థితి విషమంగా ఉందని, చికిత్స కోసం 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. కూలి పనులు చేసుకుని జీవించే తమకు ఖర్చులు భరించే స్థోమత లేదని తల్లడిల్లుతున్నారు. దాతలు స్పందించి ఆర్థిక సహాయం అందజేయాలని వేడుకున్నారు. ఆర్థిక సాయం చేసేవారు రాగం హరీశ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గంగాధర బ్రాంచ్, అకౌంట్ నెం. 62196515673, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్ 0020142కు గానీ గూగుల్పే 9550517681 లో జమచేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు.