హుజూరాబాద్టౌన్, మే 21: నిరుపేద దళితులను ధనికులుగా మార్చేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. మేలైన యూనిట్లను ఎంచుకొని ప్రభు త్వం ఇచ్చిన రూ. 10లక్షలతో ఏడాది తిరిగేలోగా రూ. కోటీ సంపాదించాలని ఆకాంక్షించారు. హు జూరాబాద్ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన రామగిరి సులోచన-శ్రీనివాస్కు దళితబంధు పథకం ద్వారా మంజూరైన వైష్ణవి కలర్ షాప్, మొలుగు సరళ-ప్రసాద్ సిమెంట్ అండ్ ఐరన్ షాప్, ఇప్పల్నర్సింగాపూర్లో బొరగాల మణెమ్మ-సాంబయ్య ఏర్పాటు చేసుకున్న స్టీల్ అండ్ ఐరన్ షాప్ యూనిట్లను ఆదివారం ఆయ న ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికాభి వృద్ధి సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. అనంతరం ఆయన లబ్ధిదారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గందె రాధిక, కౌన్సిలర్లు ముకరమేశ్, తాళ్లపల్లి శ్రీనివాస్, బొరగాల శివకుమార్, టీఆర్ఎస్ నాయకులు రామగిరి అంకూస్, మాసాడి సమ్మారావు, తిరుపతియాదవ్, దళిత సంఘాల నాయకులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.