కరీంనగర్ కలెక్టరేట్, మే 19 : పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన మూడేళ్లలో జిల్లా ప్రజలకు బండి సంజయ్ ఒరగబెట్టింది శూన్యమని కరీంనగర్ నగర మేయర్ సునీల్రావు ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ మాటలు కొత్త బిచ్చగాన్ని తలపిస్తున్నాయని మండిపడ్డారు. కరీంనగర్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్పై ఎంపీ బండి సంజయ్చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవాకులు, చవాకులు పేలుతూ, ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. పార్లమెంటు సభ్యుడిగా గెలిచి బండి సంజయ్ జిల్లా ప్రజలకు ఒరగబెట్టింది శూన్యమన్నారు. తన సెగ్మెంట్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా, కనీ సం అందుబాటులో కూడా లేకపోవడం కరీంనగర్ పార్లమెంటు ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. మంత్రి గంగుల కమలాకర్పై రెండు సార్లు చిత్తుగా ఓడిపోయి, ఎంపీగా గ్రహపాటున గెలిచాడన్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని పెట్టుబడుల కు స్వర్గధామంగా మార్చి, బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్పై బండి అనవసర విమర్శలు చేస్తుండడం హేయనీయమన్నారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో వందలాది పరిశ్రమలు తెచ్చి, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత మంత్రి కేటీఆర్దేనన్నారు. అమెరికా అనంతరం హైదరాబాద్లోనే ఐటీ రంగం విస్తరించడం వెనుక ఎవరి కృషి ఉందో ప్రజలకు తెలుసన్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణను అధోగతి పాలు చేసేందుకు ఎంపీ సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఓవైపు కేంద్రం నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెంచుతూ, సా మాన్యుల నడ్డీ విరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చే శారు.
దేశంలోని అనేక ప్రభుత్వరంగ సంస్థల ను ప్రైవేట్పరం చేస్తూ, పరిశ్రమలు మూసివేస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేననేది వా స్తవం కాదా అని ప్రశ్నించారు. యాసంగిలో వరి కి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తే, వరి వేయాలని కేంద్రం కొనుగోలు చేస్తుందంటూ కోతలు కోసి, కొనుగోళ్ల సమయానికి జాడపత్తా లేడన్నారు. మూడేళ్లలో జిల్లా అభివృద్ధికి నయాపైసా కూడా తేలేని అసమర్థ ఎంపీగా సంజయ్కి ప్రజల్లో గుర్తింపు వ చ్చిందన్నారు. ఉద్యమ నాయకుడు, నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమయ్యే మంత్రి కేటీఆర్ను మరోసారి విమర్శిస్తే తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు. ప్రేలాపనలు మాని కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు తేవాలని హితవు పలికారు. సమావేశంలో కార్పొరేటర్లు తోట రాములు, బండారి వేణు, కంసాల శ్రీనివాస్, దిండిగాల మహేశ్, కుర్ర తిరుపతి, కొలిపాక అంజయ్య, పి ట్టల శ్రీనివాస్, తులా బాలయ్య, జంగిలి సాగర్, నాంపల్లి శ్రీనివాస్, చాడగొండ బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కాశెట్టి శ్రీనివాస్, ఎడ్ల అశోక్, కరీం, అర్శ మల్లేశం పాల్గొన్నారు.