కరీంనగర్, మే 19 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు స్థలాలను జూన్ 2 లోగా గుర్తించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ బుధవారం కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో చర్చించిన అంశాలపై దిశానిర్దేశం చేసేందుకు గు రువారం కలెక్టరేట్లో మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమా వేశమయ్యారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, వై కుం ఠ ధామాలు, డంప్యార్డ్, హరితహారం, బృహ త్ పల్లె ప్రకృతి వనం, జీవో 58, 59పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూ న్ 3నుంచి 15 రోజుల పాటు చేపట్టాల్సిన కరీంనగర్ జిల్లా పల్లె ప్రగతి 5వ విడత యాక్షన్ ప్లాన్ పై సమీక్షించారు. పంచాయతీలు, మున్సి పాలిటీల్లో లాంగ్ జంప్ ఫిట్, వాలీబాల్, ఖోఖో, జి మ్నాస్టిక్స్ వంటి ఆటల కోసం క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ఎకరం చొప్పున స్థలాలను గుర్తిం చాలని కోరారు.
పరిశుభ్రతపై దృష్టిపెట్టాలని, ప వర్డేలో భాగంగా విద్యుత్ సమస్యలను పరిషరించాలన్నారు. వైకుంఠధామాల్లో సదుపా యా లు కల్పించాలని సూచించారు. పంచాయతీల్లో క్రాస్ కంట్రి వాక్ కార్యక్రమాన్ని నిర్వహించి ఎవె న్యూ ప్లాంటేషన్ కోసం అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు. బృహత్ పట్టణ ప్రకృతి వనాలు, మల్టీలేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ వంద శాతం పూర్తి చేయాలని, ఇంటిగ్రెటెడ్ వెజ్, నాన్ వెజ్ మారెట్ల నిర్మాణానికి స్థలాలను జూన్ 3 లోగా గుర్తించి పనులు ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, బల్దియా కమిషనర్ సేవాఇస్లావత్, డీపీవో వీర బుచ్చయ్య, జడ్పీ సీఈ వో ప్రియాంక, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్ ఉన్నారు.