ఎల్లారెడ్డిపేట, మే 18: గ్రామాల్లోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందామని ఎంపీపీ పిల్లి రేణుక సర్పంచులు, ఎంపీటీసీలకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. గత పల్లె ప్రగతిలో సర్పంచులు గ్రామాలను బాగు చేస్తున్నప్పటికీ, కొంత ఇబ్బందిపడ్డారని, మరోమారు ఆటంకాలు కలుగకుండా చూడాలని సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కొండాపురం బాల్రెడ్డి కోరారు. మండలంలో ఎంఈవో మంకు రాజయ్య స్మారక విగ్రహం, ఫైర్స్టేషన్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించామని, అం దుకు అనుగుణంగా ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపినట్లు వైస్ ఎంపీపీ కదిరె భాస్కర్ తెలిపారు. తమ గ్రామంలోని పాఠశాలకు అదనపు ఉపాధ్యాయులను కేటాయించాలని రాజన్నపేట సర్పంచ్ ముక్క శంకర్ కోరగా, పాఠశాల ప్రారంభమైన తర్వాత చర్యలు తీసుకుంటామని ఎం ఈవో రఘుపతి సమాధానం చెప్పారు.
తిమ్మాపూర్ ఎంపీటీసీ వరద బాబు, సర్పంచ్ పడిగెల రవీందర్ గంగమ్మ చెరువు బుంగపై ప్రశ్నించగా, ప్యాకేజీ-9 కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని అధికారులు చెప్పారు. వడ్డెర కాలనీ, శాతావాహన కాలనీకి మిషన్ భగీరథ నీరు ఇప్పించాలని కోఆప్షన్ సభ్యు డు జబ్బార్, సర్పంచ్ పాశం సరోజన కోరారు. గ్రామంలో కరెంట్ సమస్య తలెత్తితే హెల్పర్లు స్పందించడం లేదని అక్కపల్లి సర్పంచ్ ముక్క మధుకర్ మండిపడ్డారు. మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని సెస్ ఏఈ దివ్య వారికి సమాధానం చెప్పారు. హెల్త్ ప్రొఫైల్పై ప్రజలకు అవగాహన కల్పించి విజయవంతం చేస్తామని వైద్యాధికారి స్రవంతి తెలిపారు.
ఈ నెల 25లోగా అన్ని గ్రామాల్లో పూర్తి చేయాలని ఎంపీడీవో చిరంజీవి సూచించారు. ధాన్యం కొనుగోల్లు సజావుగా జరిగేలా చూస్తున్నామని తహసీల్దార్ జయంతి స్పష్టంచేశారు. ఇప్పటి వరకు మండలంలో 25 కుటుంబాలకు 1.25కోట్ల రైతుబీమాను అందించామని ఏఈవో లక్ష్మణ్ చెప్పారు. మండలంలోని గ్రంథాలయంలో మౌలిక వసతుల కోసం 17లక్షలు మంజూరైనట్లు జిల్లా చైర్మన్ ఆకునూరి శంకరయ్య తెలిపారు. అనంతరం ఏఈగా విధులు నిర్వర్తించి డీఈగా ఉద్యోగోన్నతి పొందిన శ్రీనివాస్ను ప్రజాప్రతినిధులు, అధికారులు సన్మానించారు. ఇక్కడ ఏఎంసీ చైర్మన్ కొండ రమేశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ జయంత్, అన్ని శాఖల అధికారులు ఉన్నారు.