మల్యాల, మే 18: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం ఆడబిడ్డలకు వరంలాంటిదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. బుధవారం మల్యాల మండల కేంద్రంలోని రైతువేదికలో 58 మంది లబ్ధిదారులకు రూ.58,06,728 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపద్దులను సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకే అందిస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్, తహసీల్దార్ సుజాత, జడ్పీటీసీ రామ్మోహన్రావు, సహకార సంఘాల అధ్యక్షులు రాంలింగారెడ్డి, బోయినిపల్లి మధుసూదన్రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, వైస్ ఎంపీపీ పోతాని రవి, కోఆప్షన్ సభ్యుడు అజహార్, సర్పంచులు బద్దం తిరుపతిరెడ్డి, గొడుగు కుమారస్వామి, నాయకులు జనగం శ్రీనివాస్, క్యాతం భూపతిరెడ్డి, మల్యాల గణేశ్, అయిల్నేని కోటేశ్వర్రావు, శివకుమార్, మిట్టపల్లి రమణ, తాటిపాముల రాజేందర్, పొన్నం మల్లేశం, బుచ్చయ్య, జున్ను సురేందర్, గడ్డం మల్లారెడ్డి, జోగినిపల్లి శ్రీనివాస్గౌడ్, ఆగంతం వంశీధర్, కోరుట్ల రవి, కాటిపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎడిపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.