రాయికల్ రూరల్, మే 18: గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పేరుకు పోయిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం రాయికల్ పట్టణంలోని పద్మశాలీ కల్యాణ మండపంలో 14 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలో రూ.40 లక్షలతో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాయికల్ పట్టణంలో రూ. 1.50 కోట్లతో సమీకృత మార్కెట్ను నిర్మించనున్నట్లు తెలిపారు.
మండలంలోని సర్పంచులు వారి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జాదవ్ అశ్విని, రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, వైస్ చైర్ పర్సన్ గండ్ర రమాదేవి, ఏఎంసీ చైర్మన్ గన్నె రాజారెడ్డి, వైస్ చైర్మన్ కొల్లూరి వేణు, సహకార సంఘం అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి, టీఆర్ఎస్ రాయికల్ మండలాధ్యక్షుడు కోల శ్రీనివాస్, సర్పంచులు అనుపురం శ్రీనివాస్, పాలకుర్తి రవి, కౌన్సిలర్లు మ్యాకల కాంతారావు, తురగ శ్రీధర్ రెడ్డి, నాయకులు ఎనగందుల ఉదయశ్రీ, పెండల వనిత, ఎలిగేటి అనిల్, మోర రామ్మూర్తి, కొత్తపెల్లి ప్రసాద్ పాల్గొన్నారు.