రామడుగు, మే16 : మోతె శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారి కల్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. మూలవిరాట్టుకు ఉదయం సుప్రభాత సేవ, అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తుల ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి కల్యాణానికి ఎంపీపీ కలిగేటి కవిత దంపతులు పట్టు వస్ర్తాలు, తలంబ్రాలను సమర్పించారు. గ్రామానికి చెందిన వూకంటి వాణి- కరుణాకర్రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో పద్మావతీ అలివేలుమంగ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొండగట్టు దేవాలయ ట్రస్టు బోర్డు డైరెక్టర్, గంగాధర సింగిల్విండో చైర్మన్ దూలం బాలాగౌడ్ హాజరై స్వామివారి దర్శించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అంబటి నారాయణ, ఉప సర్పంచ్ మహేశ్, మాజీ ఎంపీటీసీ బత్తిని మునయ్యగౌడ్, రవీందర్రెడ్డి, మహేందర్రెడ్డి, వార్డు సభ్యులు తాండ్ర భూమేశ్, మహేందర్, బండారి ప్రవీణ్, నేరెల్ల శారద, సంపత్, పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, భక్తులు పాల్గొన్నారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి జాతర
చొప్పదండి, మే16: రుక్మాపూర్లో శ్రీ వేంకటేశ్వర స్వామి జాతరను సోమవారం ఘనంగా నిర్వహించారు. సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మాజీ చైర్మన్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, టీర్ఎఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి ,కాంగ్రెస్ నాయకుడు మేడిపల్లి సత్యం, పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దాండియాలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చిలుక లింగయ్య, మాజీ సర్పంచ్ కర్రె శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ముద్దసాని రంగన్న, కర్రె సురేందర్ పాల్గొన్నారు.