గోదావరిఖని, మే 14: జాతీయ సంఘాలు ఇంకా కార్మికుల ను మోసం చేయాలనే చూస్తున్నాయని, వాటిని నమ్మే పరిస్థితి ఇప్పుడు సింగరేణిలో ఎక్కడా లేదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ అన్నారు. ఈ మేరకు జీడీకే-1, 3, 11వ గనులపై పిట్ సెక్రటరీలు రమేశ్ రెడ్డి, నాయిని శంకర్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన గేట్ మీటింగ్లకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన నాటి నుంచి కోలిండియాలో లేనివిధంగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో అత్యధికంగా కార్మిక హక్కులు సాధించామని వివరించారు. సింగరేణిలో ఎప్పుడు గుర్తింపు సంఘం ఎన్నికలొచ్చినా గెలుపు టీబీజీకేఎస్దేనని స్పష్టం చేశారు. నాడు వారసత్వ ఉద్యోగాలను పోగొట్టిన జాతీయ సంఘాలు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని గ నులపైకి వస్తున్నాయో కార్మికులు ప్రశ్నించే రోజులు ముందున్నాయని పేర్కొన్నారు. అనంతరం గనికి చెందిన యువ కార్మికులు, మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో టీబీజీకేఎస్లో చేరారు. ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో నాయకులు కమలాకర్ రావు, నారాయణ, సుధాకర్, ప్రభాకర్, బాలయ్య, అంకులు, సత్తయ్య, రవీందర్, శ్రీనివాస్ రెడ్డి, మేకల సత్తయ్య, మాతంగి సతీశ్ పాల్గొన్నారు.
ఒప్పందాలపై త్వరలోనే ఉత్తర్వులు
సింగరేణి కార్మికుల సమస్యలపై గత నెల 19, 20వ తేదీల్లో జరిగిన ఒప్పందాలను అమలు చేయించేందుకు ఉత్తర్వులను త్వరితగతిన జారీ చేయించి అమలు జరిగేలా చూస్తామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. గోదావరిఖని ప్రెస్క్లబ్లో శనివారం వారు మాట్లాడారు. మారుపేర్లను సరిచేసే విషయంలో న్యాయపరమై న సలహాలు తీసుకొని అమలు చేయిస్తామని, కొవిడ్ సమయం లో ఆగిపోయిన కార్మికుల వయో పరిమితిపై ఇప్పటికే యాజమాన్యంతో మాట్లాడామని, 35 ఏండ్లు దాటిన వారి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ క్లరికల్ పోస్టులు, మైనింగ్స్టాఫ్ కార్మికులకు పరీక్షలు నిర్వహించడంలో జరుగుతున్న జాప్యాన్ని వెంటనే నివారించాలని, క్లరికల్ పోస్టుల నియామకానికి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. అనంతరం టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య మాట్లాడుతూ, కార్మికుల సమస్యలు పరిష్కరించే దశలో కార్మిక సం ఘాలు ముందుకు పోతున్నా జీఎం వెల్ఫేర్ శాఖ వారు అనేక వివాదాలు సృష్టించి కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా సంబంధితశాఖ అధిపతి కార్మికుల సమస్యలను అర్థం చేసుకోవాలని, వాటిని భూతద్దంలో పెట్టి చూడకుండా సహకరించాలని కోరారు. ఇక్కడ నూనె కొంరయ్య, గండ్ర దామోదర్రావు, నాయిని మల్లేశం, కృష్ణమూర్తి, వెంకటేశం, ఎట్టం కృష్ణ, శంకర్, మండ రమేశ్ తదితరులున్నారు.