విద్యానగర్, మే 12: నర్సుల సేవలు మరువలేనివని ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల పేర్కొన్నారు. గురువారం కరీంనగర్లోని ప్రభుత్వ దవాఖానలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే ఉత్తమ కొవిడ్ హాస్పిటల్గా కరీంనగర్ దవాఖాన ఎంపిక కావడానికి నర్సింగ్ సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు. ఆర్ఎంవో డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తించారన్నారు. సిబ్బంది కొరతతో అదనపు పనిభారం పడుతున్నా ముఖంపై చిరునవ్వుతో సేవలందించడం అభినందనీయమన్నారు. అంకితభావంతో పని చేస్తున్న నర్సులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నర్సింగ్ సిబ్బందిని సన్మానించారు. స్టాఫ్ నర్స్ సరిత, నర్సింగ్ సూపరింటెండెంట్లు అంజమ్మ, సులోచన, విజయలక్ష్మి, సరళ, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్లు జీనత్, జయప్రద, వసంతారాణి, వైద్యులు చంద్రశేఖర్, రాజశ్రీ, స్టాఫ్నర్స్లు అనిత, సురేఖ, సిబ్బంది పాల్గొన్నారు.
మోతాజీఖానా అర్బన్ హెల్త్సెంటర్లో..
మోతాజీఖానా అర్బన్ హెల్త్సెంటర్లో వేడుకలను మెడికల్ ఆఫీసర్ వరుణ ప్రారంభించారు. ఏఎన్ఎంలు స్వరూపారాణి, సమీనా, లావణ్య, మాస, సులోచన, వనిత, ల్యాబ్ టెక్నీషియన్ స్వామి, రజినీకాంత్ తదితరులున్నారు.
తెలంగాణ నర్సింగ్ సమితి ఆధ్వర్యంలో..
తెలంగాణ నర్సింగ్ సమితి ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో వేడుకలను నగర మేయర్ సునీల్రావు కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన నర్సులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో నర్సింగ్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.