వేములవాడ, మే12: కార్గో ద్వారా రాజన్న ప్రసాదంతోపాటు కుంకుమ, అక్షింతలను భక్తులకు అందించేందుకు కసరత్తు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్, రాజన్న ఆలయ అధికారులతో చర్చించి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పా రు. ఇప్పటికే జగిత్యాల నుంచి కార్గో ద్వారా 22టన్నుల మామిడిపండ్లను ప్రజలకు అందించామని చెప్పారు. ఏడాదిన్నర క్రితం ప్రారంభమైన కార్గో సర్వీసుల ద్వా రా ఇప్పటివరకు రూ.100కోట్ల ఆదాయం వ చ్చిందని చెప్పారు. రాజన్న సన్నిధికి నిత్యం సుమారు 30వేల మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో టూరిస్ట్ ప్యాకేజీ ప్లాన్ను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. గురువారం వేములవాడకు వచ్చిన ఆయన, ముందుగా రాజన్నను దర్శించుకున్నారు. అద్దాల మండపంలో ఆలయ ఈవో రమాదేవి, స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం ఆలయ చైర్మన్ సమావేశ మందిరంలో కరీంనగర్ రీజియన్ పరిధిలోని అధికారులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత డిపోల వారీగా సమీక్షించారు. ప్రయాణికుల సంఖ్య, ఆదాయం, కొత్తగా ప్రయాణికులను ఆకర్షించుకునే విధంగా తీసుకుంటు న్న చర్యలపై అడిగితెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. దశాబ్దాల చరిత్రగల ఆర్టీసీకి ప్రజలతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఆదరణ పెరిగిందని చెప్పారు. కరోనా తర్వాత ఆర్టీసీలో ఇప్పటికే 72శాతం ఆక్యుపెన్సీ పెరిగిందని, పూ ర్వవైభవానికి అధికారులతో కలిసి సమన్వయంతో కృషిచేస్తామని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా ఆర్టీసీ యాప్ ప్రారంభిస్తున్నామని, బస్సు గమ్యాన్ని తెలుసుకొని ప్రయాణం చేయవచ్చునని చెప్పారు. కరీంనగర్ రీజియన్ అధికారులు సంస్థ కోసం బాగా పనిచేస్తున్నారని, రాజ న్న సిరిసిల్ల అధికారులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని అభినందించారు.
రాష్ట్రంలోని కరీంనగర్, నల్గొండ, వరంగల్ మహబూబ్లాంటి జిల్లాల నుంచి ప్రయోగాత్మకంగా ఎలక్ట్రిక్ వాహనాలను పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభిస్తామని, గ్రామీణ ప్రాంతాలకు కూడా నడిపించేలా చూస్తామని చెప్పారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న సజ్జనార్కు కలెక్టర్ అనురాగ్జయంతి, ఆలయ ఈవో, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రకాంత్, ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, ఈర్ల వెంకటేశ్వర్లు, రీజినల్ మేనేజర్ కేఎస్ ఖాన్ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఇక్కడ డివిజన్ మేనేజర్లు శంకర్, కవిత, డిపో మేనేజర్లు భీమ్రెడ్డి, మనోహర్, భూపతిరెడ్డి, మల్లయ్య, మల్లేశం, శ్రీనివాస్, నర్సప్ప, జీకే మోహన్, అర్పిత రాజయ్య, విజయేందర్రెడ్డి ఉన్నారు.