ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
ఇంటింటికీ తిరిగి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
శంకరపట్నం, మే 10: తెలంగాణ సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచారని, దేశంలోనే ఎక్కడా లేని పథకాలు అమలు చేస్తుండడమే దీనికి నిదర్శనమని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు రాజాపూర్, కాచాపూర్, గద్దపాక, ధర్మారం, కన్నాపూర్, ముత్తారం, మక్త, వంకాయగూడెం గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని ఉద్ఘాటించారు.
పర్యటనలో ఎమ్మెల్యే ఆయా గ్రామాల ప్రజలతో ముచ్చటించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో క్యారం ఆడారు. తమ వద్దకే వచ్చి ఆప్యాయంగా చెక్కులు ఇచ్చిన ఎమ్మెల్యేకు పలువురు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ పులికోట రమేశ్, సర్పంచులు పిన్రెడ్డి వసంత, కోండ్ర రాజయ్య, గోపు విజయ్కుమార్రెడ్డి, కాటం వెంకటరమణారెడ్డి, పంజాల రేణుక, నెలవేని సుష్మ, ఎంపీటీసీలు మాతంగి లక్ష్మి, ప్యాక్స్ చైర్మన్లు సంజీవరెడ్డి, తిరుపతిరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.