హుజూరాబాద్టౌన్, మే10: తెలంగాణ సరారు నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని, కల్యాణలక్ష్మితో ఆ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. మంగళవారం హుజూరాబాద్లోని సాయిరూప గార్డెన్లో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 505 మంది లబ్ధిదారులకు సుమారు రూ.5కోట్లకు పైగా విలువైన కల్యాణలక్ష్మి చెకులను ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డితో కలిసి మంత్రి అందజేశారు. అనంతరం మాట్లాడారు. బీజేపీ నేతలు బాగా మాట్లాడుతున్నారని, అసలు వారి పాలిత ప్రాంతాల్లో కల్యాణ లక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు ఉన్నాయా..? చెప్పాలని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని అన్నింటా ఆదర్శంగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని, ఈ ఎనిమిదేండ్లలో అనేక పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్నారని కొనియాడారు.
రెకాడితే గానీ డొకాడని కుటుంబాలకు ఆడబిడ్డ పెండ్లి భారం కావద్దనే ఉద్దేశంతోనే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి, రూ.లక్షా నూటపదహార్లు అందజేస్తున్నారని చెప్పారు. ఇంకా మాతా శిశు సంరక్షణపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టిపెట్టిందని, కేసీఆర్ కిట్ పథ కం కింద పలు రకాల వస్తువులతో కిట్ అందజేయడంతోపాటు మగబిడ్డ జన్మిస్తే రూ.12 వేలు, ఆడబిడ్డ జన్మిస్తే రూ.13 వేలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్లాల్, హుజూరాబాద్, జమ్మికుంట బల్దియా చైర్మన్లు గందే రాధిక శ్రీనివాస్, టీ రాజేశ్వర్రావు, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండాల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బీ రమాయాదగిరినాయక్, తహసీల్దార్ ఎల్ రాంరెడ్డి, ఆయా మండలాల తహసీల్దార్లు, జడ్పీటీసీలు ఉన్నారు.