కార్పొరేషన్, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలను బుధవారం జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని అన్ని డివిజన్లల్లో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు గులాబీ జెండాలను ఎగురవేసి స్వీట్లు పంచుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
నగరంలో మేయర్ యాదగిరి సునీల్రావు ప్రాతినిథ్యం వహిస్తున్న 33వ డివిజన్లోని భగత్నగర్ అయ్యప్ప దేవాలయ సమీపంలోని చౌరస్తా వద్ద సీఎం కేసీఆర్ కటౌట్ ఏర్పాటు చేసి పార్టీ జెండాను ఆవిషరించారు. కార్యకర్తలు డోలి ఉపేందర్, ఉయ్యాల శ్రీనివాస్గౌడ్, మేకల ఐలయ్య, సోడే ధన్రాజ్, నరేందర్, విద్యాసాగర్, కుంభం అనిల్, హమీద్, దాసరి రమేశ్, కిరణ్, సాయి, కటకం సంజీవ్, జితేందర్ పాల్గొన్నారు.
మంత్రి గంగుల కమలాకర్ మీ సేవ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకుడు మేచినేని అశోక్రావు జెండా ఎగురవేసి, స్వీట్లు పంపిణీ చేశారు.టీఆర్ఎస్స అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 37వ డివిజన్ రాంనగర్లో టీఆర్ఎస్ జెండాను డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్ ఆవిష్కరించారు. డివిజన్ అధ్యక్షుడు ఆరె చంద్రశేఖర్, యూత్ అధ్యక్షుడు వంగ హరీశ్, మహిళా విభాగం అధ్యక్షురాలు చల్ల పద్మ, బీసీ విభాగం అధ్యక్షుడు వేదాంతం సత్యనారాయణ పాల్గొన్నారు. 35వ డివిజన్లో కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి గులాబీ జెండాను ఎగురవేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
36వ డివిజన్లో కార్పొరేటర్ గుగ్గిల్ల జయశ్రీ ఆధ్వర్యంలో జెండా ఆవిషరించి స్వీట్లు పంపిణీ చేశారు. 44వ డివిజన్లో అధ్యక్షుడు బైరం పద్మయ్య, అంబేదర్ మెమోరియల్ క్లబ్ అధ్యక్షుడు కొంపెల్లి రమణ గులాబీ జెండాను ఆవిష్కరించారు. టీఆర్ఎస్ నాయకులు మాడెపు నర్సయ్య, ఉదారపు మారుతి, హరికృష్ణ, పబ్బతి శ్రీనివాసరెడ్డి, కనకయ్య, నవీన్, దొంత రాజేశం, నాగరాజు, బోనేశ్వర్ కనకరాజు, కంకణాల శేఖర్ పాల్గొన్నారు. 18వ డివిజన్ మెయిన్ రోడ్డు అంబేదర్ చౌరస్తాలో కార్పొరేటర్ సుధగోని మాధవి-కృష్ణాగౌడ్ గులాబీ జెండాను ఆవిష్కరించారు. కిసాన్నగర్లో కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్ జిల్లా నాయకుడు పెండ్యాల మహేశ్, డివిజన్ కమిటీ అధ్యక్షుడు సాంబయ్య, నాయకులు శ్రీరాములు, క్రాంతి, గసికంటి శ్రావణ్, సంపతి అశోక్, సిరిపురం సాయి, గడ్డం వీరేందర్, కుమ్మరి శ్రీను పాల్గొన్నారు. 16వ డివిజన్లో డివిజన్ అధ్యక్షుడు గడ్డం శ్రీరాములు, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. 53వ డివిజన్లో కార్పొరేటర్ టీ శ్రీదేవి-చంద్రమౌళి జెండాను ఆవిష్కరించారు.
గ్రామాగ్రామాన గులాబీ రెపరెపలు
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 27: కరీంనగర్లోని తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్లో రైతు బంధు సమితి మండల కన్వీనర్ కాశెట్టి శ్రీనివాస్ గులాబీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో కాశెట్టి దామోదర్, కొమ్ము భూమయ్య, రాజయ్య, మల్లయ్య పాల్గొన్నారు. తీగలగుట్టపల్లి రెండో డివిజన్లో గోపాడి సత్యారావు టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. గోపాల్పూర్లో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు ముస్కు మల్లారెడ్డి టీఆర్ఎస్ జెండాను ఎగువేశారు. సర్పంచ్ ఊరడి మంజుల- మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, సింగిల్ విండో వైస్ చైర్మన్ గోనె నర్సయ్య, మాజీ చైర్మన్ మంద రాజమల్లు, మెడిద రాజిరెడ్డి, మెండె శ్రీనివాస్, రమేశ్, తిరుపతి, అంజయ్య, వేణు, రాము పాల్గొన్నారు. చెర్లభూత్కూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద గ్రామాధ్యక్షుడు కూర శ్యాంసుందర్ రెడ్డి టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. సర్పంచ్ దబ్బేట రమణారెడ్డి, ఎంపీటీసీ తిరుపతి, నల్ల శ్రీనివాస్రెడ్డి, పంది తిరుపతి, చిట్కూరి సతీశ్, అజయ్, శ్రీధర్, జడ అంజయ్య పాల్గొన్నారు.
మొగ్దుంపూర్లో గ్రామాధ్యక్షుడు మైలారం నాగరాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. సర్పంచ్ జక్కం నర్సయ్య, ఎంపీటీసీ దామరపల్లి పుష్ప, అంజిరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కందుల రమేశ్, దాడి లచ్చయ్య, కందుల చంద్రయ్య, దాడి లక్ష్మణ్, వడ్లూరి అశోక్, బల్మూరి రవీందర్రావు, రాగంటి హన్మయ్య, రామగిరి శంకరయ్య, మారం సంపత్, తండ్రా రమేశ్, మైలారం ఓదెలు, చందయ్య పాల్గొన్నారు. ఎలబోతారంలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు బుచ్చాల కొమురయ్య జెండా ఎగురవేశారు. సర్పంచ్ కట్ల లక్ష్మి, గౌతం రెడ్డి, ఎంపీటీసీ చల్ల రమక్క, చల్ల లింగారెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్లు, చంద్రయ్య, హన్మయ్య, అంజయ్య పాల్గొన్నారు. చేగుర్తిలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గాండ్ల కొమురయ్య జెండాను ఎగురవేశారు. దుర్శేడ్ సింగిల్ విండో చైర్మన్ బల్మూరి ఆనందరావు, ఎంపీటీసీ ఎల్కపల్లి స్వరూప, ఉప సర్పంచ్ గాండ్ల విజయ, గాండ్ల లక్ష్మీనారాయణ, గాండ్ల అంజయ్య, ఎల్కపల్లి చంద్రమోహన్, మూల వెంకటేశం పాల్గొన్నారు.
జూబ్లీనగర్లో గ్రామాధ్యక్షుడు వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. సర్పంచ్ రుద్ర భారతి, రుద్ర రాము, మునీరెడ్డి, రమేశ్ పాల్గొన్నారు. చామనపల్లిలో గ్రామశాఖ అధ్యక్షుడు గర్వంధ శ్రీనివాస్ బస్టాండ్ చౌరస్తా వద్ద జెండాను ఎగురవేశారు. సర్పంచ్ బొగొండ లక్ష్మి, ఐలయ్య, బండారి లింగయ్య, తాళ్లపల్లి ఎల్లాగౌడ్, నర్సింగ్, మల్లయ్య, నారాయణ, పరశురాములు, ఎల్లయ్య పాల్గొన్నారు కొండాపూర్లో చింత లక్ష్మణ్ జెండాను ఎగురవేశారు. దుర్శేడ్లో శ్రీరామోజు తిరుపతి జెండాను ఎగురవేశారు. సర్పంచ్ గాజుల వెంకటమ్మ, సింగిల్ విండో డైరెక్టర్లు గాజుల అంజయ్య, తోట తిరుపతి, బోగ రాజు, నేరెళ్ల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ కోరుకంటి వేణుమాధవ్రావు, మహేశ్, కమల్, సంపత్, సతీశ్ పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, ఏప్రిల్ 27: టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకలను నగరంలోని 52వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకుడు మహమ్మద్ మాజీద్ పార్టీ జెండా ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీ నాయకులు ఇసాక్ సాథిక్, శ్రీనివాస్, షబ్బీర్ పాల్గొన్నారు.
పరీక్ష ప్యాడ్ల పంపిణీ
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 27: చామనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు బుధవారం గంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పంది తిరుపతి యాదవ్ పరీక్ష ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి 21వ అవిర్భవం దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. హెచ్ఎం కోట లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కోసం ప్యాడ్స్ అందించిన టీఆర్ఎస్ నాయకుడు పంది సంపత్ యాదవ్, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గంగుల ప్రజాసేవా సమితి నాయకులు ఎగుర్ల శ్రీనివాస్, కడారి సంపత్, దుబాసి విజయ్, పంది కుమార్స్వామి, దాసరి సుదర్శన్ పాల్గొన్నారు.
కొత్తపల్లి, ఏప్రిల్ 27 : కొత్తపల్లితో పాటు మండలంలోని గ్రామాల్లో కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, టీఆర్ఎస్ నాయకులు జెండాలను ఎగురవేశారు. కమాన్పూర్, ఆసిఫ్నగర్, ఎలగందుల గ్రామాల్లో జెండా పండుగను వైభవంగా నిర్వహించారు. నాగులమల్యాలలో టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు గోదల రంజిత్కుమార్, మండల కో ఆప్షన్ సభ్యుడు హరీశ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు గోదల చంద్రయ్య జెండా ఎగురవేశారు. వార్డు సభ్యులు కుంట అంజయ్య, ఉల్లెందుల అనిల్, గోదల నగేశ్, కోల సంతోష్, గాండ్ల రాజు, కటుకం తిరుపతి, మాజీ ఉప సర్పంచ్ గొర్రె రవి పాల్గొన్నారు. 48వ డివిజన్లో టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు బట్టు వరప్రసాద్ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. టీఆర్ఎస్వీ కరీంనగర్ నియోజకవర్గ అధ్యక్షుడు ఫహాద్ తదితరులు పాల్గొన్నారు.
కమాన్చౌరస్తా, ఏప్రిల్ 27 : కరీంనగర్ 8 డివిజన్ అలుగునూర్లో డివిజన్ అధ్యక్షుడు జాప శ్రీనివాస్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. కార్పొరేటర్ సల్ల శారదారవీందర్, కేడీసీసీబీ డైరెక్టర్ సింగిరెడ్డి స్వామిరెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు కంది రామచంద్రారెడ్డి, నాయకులు జాప రాఘవరెడ్డి, సిల్ల పరశురాములు, జాప రవీందర్ రెడ్డి, దాసం కమలాకర్, జాప లక్ష్మారెడ్డి, సిరిసిల్ల అంజయ్య, చిల్ల రాజమల్లు, యస్వాడ శ్రీకాంత్, తమ్మనవేని ఓదెలు, వేల్పుల సంతోష్ ఉన్నారు.
టీఆర్ఎస్ ప్లీనరీలో వీర్ల
రామడుగు, ఏప్రిల్ 27 : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్లోని మాదాపూర్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వేంకటేశ్వరరావు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్రావు తో కలిసి పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్తో కలిసి సెల్ఫీ తీసుకున్నారు.