సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 19: సిరిసిల్ల సెస్ నూతన కమిటీ చైర్మన్గా నియామకమైన సందర్భంగా గూడూరి ప్రవీణ్కు అభినందనలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాయకులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సెస్ చైర్మన్ గూడూరి ప్రవీణ్తోపాటు నూతన కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు గూడూరిని నూలు దండతో సన్మానించారు. అనంతరం తోట ఆగయ్య, జిందం చక్రపాణి మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డ వారికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పదవుల భర్తీలో ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు.
సెస్కు నియామకమైన నూతన కమిటీ సభ్యులు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సెస్చైర్మన్ గూడూ రి ప్రవీణ్ మాట్లాడుతూ, ప్రభుత్వం తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారంతోపాటు సంస్థ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. అనంతరం సెస్ కార్యాలయంలో చైర్మన్గా గూడూరి ప్రవీణ్ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో సెస్ కమిటీ సభ్యులు నంది శంకర్, కొమ్ము బాలయ్య, పూసపల్లి సరస్వతి, కుంబాల మల్లారెడ్డి, మాడుగుల మల్లే శం, గౌరి నారాయణరావు, మెడుదుల మల్లేశంతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ ఆకునూ రి శంకరయ్య, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, మండల కన్వీనర్ అగ్గిరాములు, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, బీసీ సెల్ మాజీ అధ్యక్షుడు బొల్లి రాంమోహన్, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ దార్నం లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి మ్యాన రవి, ఉపాధ్యక్షులు కొమిరె సంజీవ్గౌడ్, ఎండీ సత్తార్, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్, టీఆర్ఎస్ వై, టీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు.