వీణవంక, జూలై 27: రాష్ట్రంలో అభివృద్ధే ఎజెండాగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని, జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నుంచి కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లోకి వస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి స్పష్టం చేశారు. మండల కేంద్రంలో బీజేపీకి చెందిన 25 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరగా, వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ, రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు అన్ని వర్గాల ప్రజల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ర్టానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. అనునిత్యం పేదల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి, హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బాలకిషన్రావు, మాజీ జడ్పీటీసీ దాసారపు ప్రభాకర్, నాయకులు పాల్గొన్నారు.