సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 9: రాజన్న జిల్లా కేం ద్రంలో క్రీడా సంరంభానికి తెరలేచింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వేదికగా శనివారం జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ జిందం చక్రపాణి ఆధ్వర్యంలో 49వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల, బాలికల కబడ్డీ క్రీ డోత్సవాలు నిర్వహించగా, రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎస్పీ రాహుల్ హెగ్డే తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. క్రీడాప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన ఒలింపిక్ ఫ్లాగ్, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఫ్లాగ్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఫ్లాగ్లను ఆవిష్కరించారు. అంతకుముందు అంబేద్కర్ చౌక్ నుంచి జూనియర్ కళాశాల మైదానం దాకా నిర్వహించిన టార్చ్ రిలేలో ఎస్పీ రాహుల్హెగ్డే పాల్గొన్నా రు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ కబడ్డీ క్రీడ అనేది క్రీడాకారుల్లో పోటీతత్వాన్ని పెంపొందిస్తుందన్నారు. సిరిసిల్ల జిల్లా రామన్న ఖిల్లా అని చెప్పారు. పోటీల ముగింపు కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ను తీసుకొస్తామన్నారు. ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలకు తొలి ప్రాధాన్యత కల్పిస్తున్నదని చెప్పా రు. రాష్ట్ర బడ్జెట్లో క్రీడల కోసం మంత్రి కేటీఆర్ ప్రత్యేక బడ్జెట్ను కేటాయించారని తెలిపారు. తాను వాలీబాల్ క్రీడాకారుడి అని క్రీడాకారులు స్నేహపూర్వక వాతావరణంలో పోటీల్లో పాల్గొనాలన్నారు.
ఎస్పీ రాహుల్హెగ్డే మాట్లాడుతూ కబడ్డీ మన దేశంలో పుట్టిన క్రీడ అని చెప్పారు. ఎటువంటి క్రీడాపరికరాలు అవసరం లేకుండా కబడ్డీ ఆడవచ్చునన్నారు. అనంతరం నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యలు క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక్కడ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్యాదవ్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి తిరుపతి, చైర్మన్ జిందం చక్రపాణి, జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, కబడ్డీ అసోసియేషన్ నిర్వాహకులు కోడి అంతయ్య, అదనపు ఎస్పి చంద్రయ్య, డీఎస్పిలు, సీఐలు, ఎస్సైలు, కబడ్డీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.