కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 1: గోపాల్పూర్లోని రైతుల సహకారంతో అసైన్డ్ భూములను సేకరించి ల్యాండ్ పూలింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కరీంనగర్ నగర పాలక కమిషనర్ సేవా ఇస్లావత్ తెలిపారు. శుక్రవారం కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయంలో గోపాల్పూర్ గ్రామ రైతులు, ప్రజాప్రతినిధులతో ల్యాండ్ పూలింగ్పై అభిప్రాయం తెలుసుకోవడానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గోపాల్పూర్లోని సర్వే నంబర్ 461లో సాగు చేస్తున్న రైతుల నుంచి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ద్వారా రియల్ ఎస్టేట్ స్కీం ద్వారా రైతులకు లబ్ధిచేకూర్చాలని, ల్యాండ్ పూలింగ్ స్కీం ద్వారా అభివృద్ధి చేసి, రైతులు కోల్పోతున్న ఎకరా భూమికి 400 గజాల స్థలం ప్లాట్లను అందిస్తామని అధికారులు సూచించారు. రైతులు సహకారమందిస్తే, గ్రామం మరింతగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. కొందరు రైతులు మాత్రం తమకు ముందుగా సాగు భూములకు అంతిమ పట్టాలు అందించాలని, లేని పక్షంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా సాగు చేస్తున్న రైతులకు ఎకరాకు 1000 గజాల స్థలం కేటాయించాలని తెలిపారు.
బలంవతంగా భూములు తీసుకుంటే కోర్టును అశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులు ఒప్పుకుంటేనే, ల్యాండ్ పూలింగ్ స్కీం అమలు చేస్తామని అధికారులు తెలిపారు. రైతుల సూచన ప్రకారం ఎకరాకు 1000 గజాల స్థలం తమ పరిధిలో లేదని, ఉన్నతాధికారులను సంప్రదించాల్సి ఉంటుందని తెలిపారు. ముందస్తుగా ల్యాండ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, రైతులు సహకారమందించాలని కోరారు. సుడా వైస్ చైర్మన్, చీఫ్ టౌన్ ప్లానింగ్ అధికారి, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ నల్ల వెంకట్రెడ్డి, నాయకుడు ఊరడి మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, మాజీ ఎంపీటీసీ బెజ్జంకి శేఖర్, మాజీ సర్పంచ్ బెజ్జంకి అంజయ్య, విండో మాజీ చైర్మన్ మంద రాజమల్లు, మెండె శ్రీనివాస్, ఆర్ఐ భవాని, అనుముల రాములు, రమేశ్ పాల్గొన్నారు.