హుజూరాబాద్ టౌన్, జూలై 20: హుజూరాబాద్ గడ్డ మీద టీఆర్ఎస్ గెలుపే మా లక్ష్యమని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ తొట్ల స్వామియాదవ్, అధ్యక్షుడు జింకల పర్వతాలు పేర్కొన్నారు. ప్రజా చైతన్య బస్సు యాత్ర మూడో రోజులో భాగంగా హుజూరాబాద్ పట్టణంలోని 7,11, 21, 28వ వార్డుల్లో ఇంటింటా ప్రచారం చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు కరపత్రాల ద్వారా వివరిస్తూ చైతన్యవంతులుగా తీర్చిదిద్దారని చెప్పారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అందుతున్నాయని, రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే హుజూరాబాద్ సమగ్ర అభివృద్ధికి బాటలు వేసిన వారవుతామని చెప్పారు. ప్రభుత్వంలో అవినీతి, అక్రమాల, ఆరోపణలు ఉన్నవారు ఉండడం భావ్యం కాదని, న్యాయ విచారణకు ఆదేశించి తన ధర్మాన్ని నిర్వర్తించిందని, కానీ ఈటల తొందర పడి పార్టీని వీడారని దుయ్యబట్టారు. పత్రికా ముఖంగా, బహిరంగంగా తనకు తానుగానే భూములు కొనుక్కున్నానని ఈటలనే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తన అక్రమ ఆస్తుల రక్షణ కోసం కాషాయ కండువా కప్పుకున్నాడని ఆరోపించారు. ఇక్కడ జేఏసీ నాయకులు జంగిటి కమలాకర్, మబ్బు కరుణాకర్, అనిల్, వెంకట్, శ్రీకాంత్గౌడ్, అనురాగ్, రమేశ్, ప్రశాంత్, మిథున్ పాల్గొన్నారు.
బీజేపీతో అన్ని వర్గాలకు అన్యాయమే..
జమ్మికుంట, జూలై 20: బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నదని, ఆ పార్టీలో అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతుందని జేఏసీ నాయకులు విమర్శించారు. మంగళవారం అన్నం ప్రవీణ్ ఆధ్వర్యంలో వావిలాల గ్రామంలో, కొమ్ము నరేశ్ ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని 3,4,5వార్డుల్లో బృంద సభ్యులు పర్యటించారు. ఇంటింటికీ వెళ్లారు. పొలాల వద్దకూ వెళ్లి ప్రచారం చేశారు. కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను తెలియజేశారు. అక్కడక్కడ ప్రజలను, గ్రామస్తులను పోగేశారు. వారితో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధిని ఉద్యమంలా చేపడుతున్న టీఆర్ఎస్కే ఓటు వేయాలని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు.
వీణవంక మండలంలో..
వీణవంక, జూలై 20: ఎలుబాక, గంగారం గ్రామాల్లో తెలంగాణ ఓయూ జేఏసీ విద్యార్థులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. టీఆర్ఎస్ పార్టీతోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని, రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇక్కడ ఓయూ జేఏసీ కన్వీనర్ దశరథ్, నాయకులు కరుణాకర్రెడ్డి, మ్యాడగోని భరత్, మధుసూదన్రెడ్డి, సాయివర్ధన్ పాల్గొన్నారు.
కమలాపూర్ మండలంలో..
కమలాపూర్, జూలై 20: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా తెలంగాణ జేఏసీ విద్యార్థులు పనిచేస్తారని జేఏసీ మండల కన్వీనర్ విజయ్రావు అన్నారు. మండలంలోని ఉప్పల్, భీంపల్లి, కన్నూరు, కొత్తపల్లి గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేశారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విధానాలను వివరిస్తూ ప్రజలను చైతన్య పరిచారు. రాబోయే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వేల్పుకొండ వెంకటేశ్, జంగయ్య, రాజ్కుమార్, రమేశ్, ప్రదీప్, సురేశ్, చంద్రకాంత్, ప్రశాంత్, రాజు, రమాకాంత్, శ్రీకాంత్, మహేశ్వర్, క్రాంతి, కరుణాకర్ తదతరులు పాల్గొన్నారు.