చిన్నతనంలో అమ్మనాన్నల మృతి
అన్నీ తానైచూసుకున్న భర్త ప్రాణాపాయస్థితిలో
చికిత్సకు రూ. 15 లక్షల ఖర్చవుతుందని వైద్యుల వెల్లడి
ఆదుకోవాలని ఓ అభాగ్యురాలి వేడుకోలు
రాజన్నసిరిసిల్ల జిల్లా బొప్పాపూర్లో మానవీయ ఘటన
ఆదుకోవాలని చేతులు జోడించి వేడుకుంటున్న బొప్పాపూర్కు చెందిన శ్రీనివాస్ భార్య రేణుక, బిడ్డ
ఎల్లారెడ్డిపేట, జూలై 20: ఆడుకునే వయసులో నాన్న, బడికెళ్లే ఈడులో అమ్మ దూరమయ్యారు. ఇప్పుడు భర్త బ్రెయిన్స్టోక్కు గురై హాస్పిటల్లో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. చికిత్సకు రూ.15లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో ఆ నిరుపేద ఆడబిడ్డ..దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ‘నేనేం పాపం చేశాను దేవుడా.. నాకెందుకు ఈ కష్టాలు’ అంటూ దీనంగా రోదిస్తున్నది. దాతలు ఆపన్నహస్తం అందించి నా భర్త ప్రాణాలను కాపాడాలని చేతులు జోడించి వేడుకుంటున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేటకు చెందిన నామాపురం శోభ-బాలాగౌడ్కు ఇద్దరు కూతుళ్లు స్వప్న, రేణుక, కొడుకు విగ్నేశ్ ఉన్నారు. బాలాగౌడ్ 1994లో ఏండ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు.
తల్లి శోభ 2002లో పెద్ద కూతురు పెళ్లిచేసింది. ఈ క్రమంలో 2004లో శోభ అనారోగ్యంతో మరణించింది. రేణుకకు 2008లో బొప్పాపూర్కు చెందిన అతికం శ్రీనివాస్తో వివాహమైంది. వారికి పదేళ్ల కూతురు ఉన్నది. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ గీత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకొనేవాడు. నాలుగేండ్ల కిందట అప్పుచేసి దుబాయ్కు వెళ్లాడు. అక్కడ పనిలేకపోవడంతో ఏడాది కిందట ఇంటికి తిరిగివచ్చాడు. ఊరిలోని కల్లు దుకాణంలో పనిచేస్తూ భార్యాబిడ్డలను సాదుకుంటున్నాడు. ఈ క్రమం లో శ్రీనివాస్ నాలుగురోజుల క్రితం బ్రెయిన్స్ట్రోక్కు గురయ్యాడు.
అచేతనస్థితిలో ఉన్న శ్రీనివాస్ను చికిత్స కోసం హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కు తరలించారు. ఆపరేషన్కు రూ.15 లక్షలు అవసరమని చెప్పడంతో రేణుక ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో తెలియక నరకయాతన అనుభవిస్తున్నది. దాతలు ముందుకువచ్చి తన భర్తను కాపాడాలని అర్తిస్తున్నది. సాయం చేయాల్సిన వారు గూగుల్పే నం. ఎన్. విగ్నేశ్ 9652645907కు, స్టేట్బ్యాంకు ఆఫ్ ఇండి యా, గంభీరావుపేట, అకౌంట్ నంబర్ 62424285450 ఐఎఫ్ఎస్సీ ఎస్బీఐఎన్ 0020295కు పంపించాలని వేడుకుంటున్నది.