కార్పొరేషన్, డిసెంబర్ 15: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ నాలుగేండ్లలో చేసిందేమీ లేదని, బలాదూర్ తిరుగుతూ అక్కరకు రాని వ్యక్తిగా మారిపోయాడని బీఆర్ఎస్ నాయకుడు, జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ జమీలొద్దీన్ విమర్శించారు. ఎంపీగా కేంద్రం నుంచి ఒక్కరూపాయి కూడా తెచ్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. వెంటనే ప్రజలకు క్షమాపణ చె ప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిధులు ఇ వ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అభివృద్ధి పనులు చేస్తుంటే ఆయనకు, ఆపార్టీ నేతలకు సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు.
బండి సంజయ్ది ప్రజా సంగ్రామ యాత్ర కాదని, అది ప్రజలపై చేపడుతున్న సంగ్రామ యాత్ర అని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాం లో ఎప్పుడు లేని విధంగా రూపాయి విలువ పతనమైపోతున్నదని, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని, ఇది ప్రజలపై చేస్తున్న బీజేపీ సంగ్రామ యాత్రగా అభివర్ణించారు. బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా నాలుగేండ్లలో ఒరగబెట్టిందేమీ లేదన్నారు. నాటి ఎంపీ వినోద్కుమార్ కరీంనగర్ మీదుగా ఎన్నో జాతీయ రహదారులకు ప్రతిపాదనలు చేస్తే బండి సంజయ్ ఇప్పటివరకు ఒక్కటి కూడా సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు.
జగిత్యాల, వరంగల్ జాతీయ రహదారి పనులు ప్రారంభించకపోవడంపై సిగ్గువేయడం లేదా అని ప్రశ్నించారు. తీగలగుట్టపల్లి వద్ద రైల్వే గేటు పడడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, కనీసం ఓవర్ బ్రిడ్జి కూడా తీసుకురాలేని నాయకుడికి ఎంపీ పదవి ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికైనా బండి పిచ్చిమాటలు మానుకొని పనికొచ్చే పనులు చేయాలన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్యాం సుందర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, నాయకులు పిల్లి మ హేశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెం ట్ రాజశేఖర్, కొత్తపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు మొం డయ్య, శ్రీకాంత్, వేణుగోపాల్, నాయకులు రాంబాబు, ప్రభాకర్, అన్వర్, రాజమల్లు ఉన్నారు.